NTV Telugu Site icon

Poisonous Liquor: కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మంది..

Liqor

Liqor

Poisonous Liquor: ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు. చేరారుగంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది సోమవారం సాయంత్రం మౌండ్‌పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో 17 మంది అస్వస్థత చెందారు. ఈ ఘటనలో తీవ్రమైన వాంతుల గురించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Akhil- Niharika: అఖిల్- నిహారిక జోడీగా రాజమౌళి కొడుకు సినిమా.. కానీ?

ఇక బాధితులు చికిట్టిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ లో చేరిన తర్వాత, ఐదుగురి పరిస్థితి క్షీణించింది. తరువాత వారిని బెర్హంపూర్ నగరంలోని MKCG మెడికల్ కాలేజీ & ఆసుపత్రికి తరలించారు చిక్విటీ ఎమ్మెల్యే మనోరంజన్ దయాన్ సామంత్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ క్రమం తప్పకుండా దాడులు నిర్వహించడం లేదని ఆరోపించారు. కొద్దీ రోజుల క్రితం తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అయితే అక్కడ అనేకమంది ప్రాణాలు కోల్పోయింది. ఆ కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోని చర్యలు చేపట్టింది.