Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం
- కేజ్రీవాల్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
- మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
- మరి కాసేపట్లో తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది. మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్ను సీబీఐ శనివారం కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ను జైలుకు పంపాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ తీర్పును రిజర్వ్లో ఉంచి, ఆ తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరి కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మళ్లీ జులై 12న మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
READ MORE: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
- Raviteja: 'ఇరుముడి' విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ తన దరఖాస్తులో పేర్కొంది. కొత్త మద్యం పాలసీలో లాభాల మార్జిన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడానికి గల కారణాలపై కూడా కేజ్రీవాల్ సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో క్యాబినెట్లో మద్యం పాలసీని మార్చడం అవసరమా? అలాగే సౌత్ లాబీకి సంబంధించిన కేసులో నిందితులు ఢిల్లీలో మకాం వేసి కేజ్రీవాల్కు సన్నిహితుడైన విజయ్నాయర్తో టచ్లో ఉన్నారని సీబీఐ పేర్కొంది. అలాగే కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు తొందరపడిందని ప్రశ్నించింది. అరవింద్ కేజ్రీవాల్ను విచారించిన సమయంలో.. అతని సన్నిహితుడు విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో అనేకసార్లు సమావేశమయ్యారని ఆరోపించింది. కోట్లాది రూపాయల లంచం డిమాండ్ చేశారని, గోవా ఎన్నికలలో సుమారు 44.5 కోట్ల రూపాయల లంచాన్ని ఉపయోగించారని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అర్జున్ పాండే మరియు గౌతమ్తో భేటీకి కారణం వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని పేర్కొంది.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!