Vizag Crime: బాలికపై సామూహిక అత్యాచారం.. 13 మందిపై కేసు, 11 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్తో పాటు అతని స్నేహితుడు షోయాబ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Read Also: NTR: దేవర గ్లిమ్ప్స్ ముందున్న టార్గెట్ ఇదే… 24 గంటల్లో అన్ని లైకులా సాధ్యమేనా
Also Read
- Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
- PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
- Shreyas Iyer: విమర్శకుల నోళ్లు మూయించిన శ్రేయస్ అయ్యర్.. ఒక్క ఇన్నింగ్స్తో పటాపంచల్..
- TMC Crisis: మమతకు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన ‘‘రైట్ హ్యాండ్’’
కాగా, విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం సృష్టించింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి నరకం చూపించారు కామాంధులు.. నగరంలోని పలు లాడ్జిలకు తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికను రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ఘటనలో 13 మందిని కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Whatsapp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా..
ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు కుక్కలకు ఆహారం పెట్టే పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు ఓ హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన పాడుబుద్ధికి పనిచెప్పాడు.. తన స్నేహితుడిని అత్యాచారానికి ప్రోత్సహించాడు.. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది. కానీ, పెనం పైనుంచి ఆ బాలిక పొయ్యిలో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ బాలికకు నరకం చూపించారు.. తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక, దళిత బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
-
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
-
PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
-
Balochistan: పాకిస్థాన్ని చావుదెబ్బ తీసిన బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. BLA దెబ్బకు 30 మంది పాక్ సైనికులు ఖతం!
-
Europe Heat Wave: డేంజర్ జోన్లో యూరప్.. వేలాది మరణాలపై సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..