NTV Telugu Site icon

AP Government 100 Days: ప్రభుత్వానికి 100 రోజులు.. భేటీకి హాజరుకానున్న ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు..

Cm

Cm

AP Government 100 Days: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేయనున్నారు.

Chinmayi Sripada: మైనర్ రేప్ కేసు అంటూ చిన్మయి సంచలనం..

రేపు CK కన్వెన్షన్ మంగళగిరిలో నిర్వహిస్తున్న ఎన్డిఏ శాసనసభాపక్ష సమావేశo జరగనుంది. ఈ సమావేశానికి 164మంది ఎన్డిఏ మిత్ర పక్ష శాసన సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

IND vs China Asian Champions Trophy 2024: భారత్ vs చైనా.. నేడే ఫైనల్