Warangal: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న ఒక చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో ఆదివారం ఉదయం వేకువజామున జరిగింది. బదావత్ మాలు-కవిత దంపతులకు ఏడాది వయసున్న మణికంఠ అనే బాబు ఉన్నాడు. మణికంఠ తండ్రి అయ్యప్పమాల వేసుకున్నాడు. దీంతో ఇంట్లో నిత్యం పూజలు, దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చేస్తున్నారు. ఇక మాల వేసుకున్నవారు ఇంట్లో ఉంటే మహిళలకు విపరీతమైన పని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదినెలల చిన్నారి ఏడుస్తుంటే ఊరడించడానికి తల్లి.. చిన్నారికి కొబ్బరి ముక్క చేతిలో పెట్టింది. దీంతో ఆ బాలుడు ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉండగా.. ఒక్క సారిగా ఆ గొంతులో అడ్డుపడింది. దీంతో ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే చిన్నారి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
ఇటీవలే తండ్రి చాక్లెట్ ఇవ్వడంతో అదికాస్త గొంతులో చిక్కుకుని చిన్నారి మృతి చెందాడు. నవంబర్ 27న ఇలాంటి ఘటనే పిన్నవారి వీధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి సందీప్ తండ్రి ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అక్కడినుంచి పిల్లల కోసం చాక్లెట్లు తెచ్చాడు. ఆ చాక్లెట్ ను స్కూలుకు తీసుకువెళ్లిన చిన్నారి.. తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. మరో ఘటనలో ఓ వ్యక్తి మాంసాహారం భుజిస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా అది వెలికి రాలేదు. దీంతో ఊపిరి ఆడక అతను మరణించాడు.