ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తన అనుచరులకు మర్యాదగా ఎలా మాట్లాడాలో, సంయమనంతో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆడ పిల్లల గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైన మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తాను అంగీకరించనని యోగి స్పష్టం చేశారు.
అఖిలేష్ గురించి మాట్లాడుతూ.. మీరు ఇతరులకు సలహా ఇస్తారు, ముందుగా మీ అనుచరులకు కూడా మాట్లాడే విధానాన్ని నేర్పించాలని, లేకపోతే వారిని మాకు అప్పగిస్తే, మేమే వివరిస్తామని అన్నారు. మరోవైపు, అదితి యాదవ్పై సోషల్ మీడియాతో తప్పుడు, అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేసిన ఆరోపణలపై కాన్పూర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

