CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..

  • ప్రయాగ్‌రాజ్‌లో యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు.
  • భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని వ్యాఖ్య.
  • "దేవాలయానికి ఉపయోగపడకపోతే యువత నిరుపయోగం" అని పిలుపు.
Yogi

Yogi

ఓవైపు అయోధ్య రామ మందిర కానుకల చోరీ వివాదంగా మారిన సమయంలో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలో ఉందని, భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని ఆయన సోమవారం ప్రయాగ్ రాజ్‌లో అన్నారు. రాముడు అంటే జాతి అని, ఆయనే భారతదేశ ఆత్మ మూలమని చెప్పారు. దేశంలో ఈ రోజు చూస్తున్న రామ మందిరం అశోక్ సింఘాల్ సంకల్పం, కల ఫలితమేనని చెప్పారు. ఇదే సమయంలో యువతను ఉత్తేజపరుస్తూ.. ‘‘దేవాలయానికి ఉపయోగపడకపోతే యువత నిరుపయోగం’’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆనాటి యువత, అశోక్ సింఘాల్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన రామ మందిర కానుకల చోరీ కేసులో సిట్ విచారణ జరుపుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శ చంపత్ రాయ్, సభ్యులు అనిల్ మిశ్రాలు చేసిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. పాపంలో పాలుపంచుకున్న ఎవరైనా శిక్షింబడుతారు అని ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అన్నారు.