CM Yogi Adityanath: గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల తాళాలను లబ్ధిదారులకు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఈ ఫ్లాట్లను నిర్మించారు, ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఫ్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందించారు.
Read Also: UtterPradesh: పది రూపాయల గొడవ .. దుకాణదారుడిపై దుండగుల కాల్పులు…
Also Read
ఒక్కో ఫ్లాట్లో 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు గదులు, వంటగది, మరుగుదొడ్డి ఉన్నాయి. ఫ్లాట్ల కోసం 6,000 మందికి పైగా ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లాటరీ పద్ధతిలో 1,590 మందిని అర్హులుగా గుర్తించారు. 2017కి ముందు ఏ మాఫియా అయినా పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూమిని లాక్కునే రాష్ట్రంగా యూపీ ఉండేదని.. అప్పుడు పేదలు నిస్సాహయంగా చూడారు.. ఇప్పుడు మనం ఇదే భూమిలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని.. ఈ మాఫియా భూమిని తీసుకుని పెద్ద విజయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు.
ఉమేష్ పాల్ హత్య, కిడ్నాప్ కేసులతో పాటు 100 క్రిమినల్ కేసుల్లో దోషిగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. వైద్యపరీక్షల నిమిత్తం వీరిద్దర్ని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మీడియా చుట్టుముట్టిన సమయంలో, మీడియా ముసుగులో వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు అతిక్ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!