CM Yogi Adityanath: గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల తాళాలను లబ్ధిదారులకు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఈ ఫ్లాట్లను నిర్మించారు, ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఫ్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందించారు.
Read Also: UtterPradesh: పది రూపాయల గొడవ .. దుకాణదారుడిపై దుండగుల కాల్పులు…
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఒక్కో ఫ్లాట్లో 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు గదులు, వంటగది, మరుగుదొడ్డి ఉన్నాయి. ఫ్లాట్ల కోసం 6,000 మందికి పైగా ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లాటరీ పద్ధతిలో 1,590 మందిని అర్హులుగా గుర్తించారు. 2017కి ముందు ఏ మాఫియా అయినా పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూమిని లాక్కునే రాష్ట్రంగా యూపీ ఉండేదని.. అప్పుడు పేదలు నిస్సాహయంగా చూడారు.. ఇప్పుడు మనం ఇదే భూమిలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని.. ఈ మాఫియా భూమిని తీసుకుని పెద్ద విజయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు.
ఉమేష్ పాల్ హత్య, కిడ్నాప్ కేసులతో పాటు 100 క్రిమినల్ కేసుల్లో దోషిగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. వైద్యపరీక్షల నిమిత్తం వీరిద్దర్ని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మీడియా చుట్టుముట్టిన సమయంలో, మీడియా ముసుగులో వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు అతిక్ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!