Yasin Malik Hunger Strike: తీహార్ జైలులో యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yasin Malik Hunger Strike: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
తీహార్ జైలు నంబర్ 7లో ఉన్న మాలిక్ జూలై 22(శుక్రవారం) ఉదయం నుంచి తన నిరాహార దీక్ష ప్రారంభించాడు. వెంటనే తన నిరసనను విరమించుకోవాలని జైలు అధికారులు సూచించగా.. ఆయన దానికి నిరాకరించాడు. మన దేశ న్యాయస్థానావ్వో న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ.. తన కేసులపై విచారణ తీరు మారేవరకు లేదా మరణించే వరకు దీక్ష చేస్తానని చెప్పినట్లు మాలిక్ కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. 2019లో జేకేఎల్ఎఫ్ నిషేధించబడిన కొద్దికాలానికే యాసిన్ మాలిక్ అరెస్టయ్యాడు. ఈ ఏడాది మే 19న తీవ్రవాద నిధుల కేసుల్లో ఎన్ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది. మే 25న జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Heavy Rain in Warangal: తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం..!
ఈ ఏడాది జులై 15న, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్, డిసెంబర్ 8, 1989న జేకేఎల్ఎఫ్ తీవ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేసిన కేసులో మాలిక్ను గుర్తించారు.డిసెంబరు 8, 1989న శ్రీనగర్లో రుబయ్యా అపహరణకు గురయ్యారు. ఐదు రోజుల తర్వాత డిసెంబరు 13న ఐదు రోజుల తర్వాత కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం ఆమె కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టింది. ఈ కేసులో మాలిక్తోపాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. రుబయ్యా సయీద్ అపహరణ కేసుతో పాటు, జనవరి 1990లో శ్రీనగర్లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అధికారులను కాల్చిచంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!