Yasin Malik Hunger Strike: తీహార్ జైలులో యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yasin Malik Hunger Strike: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
తీహార్ జైలు నంబర్ 7లో ఉన్న మాలిక్ జూలై 22(శుక్రవారం) ఉదయం నుంచి తన నిరాహార దీక్ష ప్రారంభించాడు. వెంటనే తన నిరసనను విరమించుకోవాలని జైలు అధికారులు సూచించగా.. ఆయన దానికి నిరాకరించాడు. మన దేశ న్యాయస్థానావ్వో న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ.. తన కేసులపై విచారణ తీరు మారేవరకు లేదా మరణించే వరకు దీక్ష చేస్తానని చెప్పినట్లు మాలిక్ కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. 2019లో జేకేఎల్ఎఫ్ నిషేధించబడిన కొద్దికాలానికే యాసిన్ మాలిక్ అరెస్టయ్యాడు. ఈ ఏడాది మే 19న తీవ్రవాద నిధుల కేసుల్లో ఎన్ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది. మే 25న జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించింది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
Heavy Rain in Warangal: తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం..!
ఈ ఏడాది జులై 15న, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్, డిసెంబర్ 8, 1989న జేకేఎల్ఎఫ్ తీవ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేసిన కేసులో మాలిక్ను గుర్తించారు.డిసెంబరు 8, 1989న శ్రీనగర్లో రుబయ్యా అపహరణకు గురయ్యారు. ఐదు రోజుల తర్వాత డిసెంబరు 13న ఐదు రోజుల తర్వాత కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం ఆమె కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టింది. ఈ కేసులో మాలిక్తోపాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. రుబయ్యా సయీద్ అపహరణ కేసుతో పాటు, జనవరి 1990లో శ్రీనగర్లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అధికారులను కాల్చిచంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..