Dalai Lama: భారత్, చైనా కలిసి పనిచేస్తే ప్రపంచానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని.. ముఖ్యంగా సైన్ అండ్ టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు. ప్రపంచశాంతిని సాధించడానికి, ప్రజలు తమలో తాము శాంతిని కలిగి ఉండాలని.. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..
Also Read
మానవుడు ‘కరుణ’ను కలిగి ఉండాలని దలైలామా అన్నారు. కరుణ అనేది మానవ స్వభావానికి విలువైన అంతర్గత వనరు అని.. మన వ్యక్తిగత శ్రేయస్సు , సమాజంలో సామరస్యానికి రెండింటికి పునాది అని ఆయన తెలిపారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.. చాలా చిన్న వయసు నుంచి కరుణ అన్ని ఆనందాలకు మూలం అని తెలిపారు. అయితే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కరుణ అనేని మరసబారుతోందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో ‘అహింసా’, ‘కరుణ’ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో స్ఫూర్తి పొందానని దలైలామా తెలిపారు.
టిబెటన్లు ఎప్పుడూ భారతీయ ఆలోచనలచే ప్రభావితం అవుతారని.. గతంలో టిబెటన్లు, భారతీయులను తమ గురువులుగా భావించే వారని.. టిబెట్ శరణార్థులను స్వాగతించినందుకు, భారత్ లో చదువుకోనిచ్చినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయిన తర్వాత దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్ధాలుగా భారతదేశంలో అతిథిగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!