Dalai Lama: భారత్, చైనా కలిసి పనిచేస్తే ప్రపంచానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని.. ముఖ్యంగా సైన్ అండ్ టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు. ప్రపంచశాంతిని సాధించడానికి, ప్రజలు తమలో తాము శాంతిని కలిగి ఉండాలని.. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
మానవుడు ‘కరుణ’ను కలిగి ఉండాలని దలైలామా అన్నారు. కరుణ అనేది మానవ స్వభావానికి విలువైన అంతర్గత వనరు అని.. మన వ్యక్తిగత శ్రేయస్సు , సమాజంలో సామరస్యానికి రెండింటికి పునాది అని ఆయన తెలిపారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.. చాలా చిన్న వయసు నుంచి కరుణ అన్ని ఆనందాలకు మూలం అని తెలిపారు. అయితే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కరుణ అనేని మరసబారుతోందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో ‘అహింసా’, ‘కరుణ’ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో స్ఫూర్తి పొందానని దలైలామా తెలిపారు.
టిబెటన్లు ఎప్పుడూ భారతీయ ఆలోచనలచే ప్రభావితం అవుతారని.. గతంలో టిబెటన్లు, భారతీయులను తమ గురువులుగా భావించే వారని.. టిబెట్ శరణార్థులను స్వాగతించినందుకు, భారత్ లో చదువుకోనిచ్చినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయిన తర్వాత దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్ధాలుగా భారతదేశంలో అతిథిగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!