Dalai Lama: భారత్, చైనా కలిసి పనిచేస్తే ప్రపంచానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని.. ముఖ్యంగా సైన్ అండ్ టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు. ప్రపంచశాంతిని సాధించడానికి, ప్రజలు తమలో తాము శాంతిని కలిగి ఉండాలని.. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..
Also Read
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
మానవుడు ‘కరుణ’ను కలిగి ఉండాలని దలైలామా అన్నారు. కరుణ అనేది మానవ స్వభావానికి విలువైన అంతర్గత వనరు అని.. మన వ్యక్తిగత శ్రేయస్సు , సమాజంలో సామరస్యానికి రెండింటికి పునాది అని ఆయన తెలిపారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.. చాలా చిన్న వయసు నుంచి కరుణ అన్ని ఆనందాలకు మూలం అని తెలిపారు. అయితే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కరుణ అనేని మరసబారుతోందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో ‘అహింసా’, ‘కరుణ’ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో స్ఫూర్తి పొందానని దలైలామా తెలిపారు.
టిబెటన్లు ఎప్పుడూ భారతీయ ఆలోచనలచే ప్రభావితం అవుతారని.. గతంలో టిబెటన్లు, భారతీయులను తమ గురువులుగా భావించే వారని.. టిబెట్ శరణార్థులను స్వాగతించినందుకు, భారత్ లో చదువుకోనిచ్చినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయిన తర్వాత దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్ధాలుగా భారతదేశంలో అతిథిగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!