Dalai Lama: భారత్, చైనా కలిసి పనిచేస్తే ప్రపంచానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని.. ముఖ్యంగా సైన్ అండ్ టెక్నాలజీలో పురోగమించిందని ఆయన అన్నారు. ప్రపంచశాంతిని సాధించడానికి, ప్రజలు తమలో తాము శాంతిని కలిగి ఉండాలని.. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
మానవుడు ‘కరుణ’ను కలిగి ఉండాలని దలైలామా అన్నారు. కరుణ అనేది మానవ స్వభావానికి విలువైన అంతర్గత వనరు అని.. మన వ్యక్తిగత శ్రేయస్సు , సమాజంలో సామరస్యానికి రెండింటికి పునాది అని ఆయన తెలిపారు. మనం పుట్టినప్పటి నుంచి మన తల్లి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.. చాలా చిన్న వయసు నుంచి కరుణ అన్ని ఆనందాలకు మూలం అని తెలిపారు. అయితే పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కరుణ అనేని మరసబారుతోందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో ‘అహింసా’, ‘కరుణ’ను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో స్ఫూర్తి పొందానని దలైలామా తెలిపారు.
టిబెటన్లు ఎప్పుడూ భారతీయ ఆలోచనలచే ప్రభావితం అవుతారని.. గతంలో టిబెటన్లు, భారతీయులను తమ గురువులుగా భావించే వారని.. టిబెట్ శరణార్థులను స్వాగతించినందుకు, భారత్ లో చదువుకోనిచ్చినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయిన తర్వాత దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్ధాలుగా భారతదేశంలో అతిథిగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..