S Jaishankar: 5 ఏళ్లలో తొలిసారి చైనా పర్యటనకు జైశంకర్..
- చైనా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్..
- ఐదేళ్లలో ఇదే తొలి పర్యటన..
- రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు కృషి..
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
జూలై 14-15 తేదీలలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్ జైశంకర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశానికి సంబంధించి రేర్ ఎర్త్ మెటీయల్స్ సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
Read Also: Thalassemia Disease: తలసేమియాపై అవగాహన.. ఆర్కే బీచ్లో 3కె, 5కె, 10కె రన్!
ఇటీవల దలైలామా వారసత్వం, ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వంటి అంశాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించే అవకాశం ఉందని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. గతేడాది చివర్లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి భారత అధికారులు చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతోంది. గత నెలలో, కింగ్డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను సందర్శించారు.
ఈ ఏడాది ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో భారతదేశంలో చైనా రాయబారి ప్రధాని మోడీని హృదయపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, భారత్ ప్రధాని హజరును ధ్రువీకరించలేదు. దీంతో పాటు వాంగ్ యీ సరిహద్దులపై చర్చించేందుకు జూలైలో అజిత్ దోవల్తో చర్చలు జరిపేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
-
Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
-
Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?