S Jaishankar: 5 ఏళ్లలో తొలిసారి చైనా పర్యటనకు జైశంకర్..
- చైనా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్..
- ఐదేళ్లలో ఇదే తొలి పర్యటన..
- రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
జూలై 14-15 తేదీలలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్ జైశంకర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశానికి సంబంధించి రేర్ ఎర్త్ మెటీయల్స్ సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
Read Also: Thalassemia Disease: తలసేమియాపై అవగాహన.. ఆర్కే బీచ్లో 3కె, 5కె, 10కె రన్!
ఇటీవల దలైలామా వారసత్వం, ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వంటి అంశాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించే అవకాశం ఉందని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. గతేడాది చివర్లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి భారత అధికారులు చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతోంది. గత నెలలో, కింగ్డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను సందర్శించారు.
ఈ ఏడాది ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో భారతదేశంలో చైనా రాయబారి ప్రధాని మోడీని హృదయపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, భారత్ ప్రధాని హజరును ధ్రువీకరించలేదు. దీంతో పాటు వాంగ్ యీ సరిహద్దులపై చర్చించేందుకు జూలైలో అజిత్ దోవల్తో చర్చలు జరిపేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!