Puducherry: తన కొడుకే ఫస్ట్ రావాలని.. వేరే విద్యార్థికి విషమిచ్చి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
woman killed son’s classmate in Puducherry:
అభం శుభం తెలియని పసివాడు.. బాగా చదువుకోవడమే అతను చేసిన తప్పయింది. ఓ పిల్లాడి తల్లికి కోపం వచ్చింది.. అసూయ కలిగింది. నా కొడుకు కంటే బాగా చదువుతావా.,. నీ పని చెబుతా అంటూ అతని మీద దాష్టీకం చూపించింది. శీతలపానీయంలో విషం కలిపి ఇచ్చిందో తల్లి… పుదుచ్చేరిలోని కారైక్కాల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సహాయరాణి విక్టోరియాను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ 8 తరగతి విద్యార్థి మణికందన్ మృతిచెందడం మరింత విషాదం నింపింది.
తన కొడుకు ఆనందం కోసం మరొకరి కొడుకును దారుణంగా చంపింది. తన కొడుకు కన్నా ఎక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఏకంగా.. ఓ విద్యార్థినే విషమిచ్చి చంపింది. కొడుకు క్లాస్మెట్ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. తన కుమారుడు క్లాస్ ఫస్ట్ రావాలనే ఉద్దేశ్యంతోనే మహిళ ఇలా చేసిందని పోలీస్ విచారణలో తేలింది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను ఏ విధంగా మారుస్తున్నాయో చూపేలా ఈ ఘటన ఉంది.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
Read Also: Odisha: ప్రియురాలి గొంతు కోసి హత్య.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి కారైక్కల్ లో ఈ ఘటన జరిగింది. తన కుమారుడి కన్నా ఎక్కవ మార్కులు వస్తున్నాయని సదరు మహిళ కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేసింది. 8వ తరగతి చదువుతున్న రాజేంద్రన్- మాలతి కుమారుడికి స్కూల్ వాచ్మెన్ ద్వారా విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ తరువాత విద్యార్థి మణికందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు మణికందన్.
సీసీ పుటేజీ ద్వారా ఈ కుట్రకు పాల్పడిన సహాయరాణి విక్టోరియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మొదటి నుంచి తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని పక్కకు తోసి రాజేంద్రన్-మాలతిల కుమారుడు ఫస్ట్ వస్తున్నాడనే కోపంతోనే విషమిచ్చానని నిందితురాలు అంగీకరించింది.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?