Puducherry: తన కొడుకే ఫస్ట్ రావాలని.. వేరే విద్యార్థికి విషమిచ్చి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
woman killed son’s classmate in Puducherry:
అభం శుభం తెలియని పసివాడు.. బాగా చదువుకోవడమే అతను చేసిన తప్పయింది. ఓ పిల్లాడి తల్లికి కోపం వచ్చింది.. అసూయ కలిగింది. నా కొడుకు కంటే బాగా చదువుతావా.,. నీ పని చెబుతా అంటూ అతని మీద దాష్టీకం చూపించింది. శీతలపానీయంలో విషం కలిపి ఇచ్చిందో తల్లి… పుదుచ్చేరిలోని కారైక్కాల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సహాయరాణి విక్టోరియాను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ 8 తరగతి విద్యార్థి మణికందన్ మృతిచెందడం మరింత విషాదం నింపింది.
తన కొడుకు ఆనందం కోసం మరొకరి కొడుకును దారుణంగా చంపింది. తన కొడుకు కన్నా ఎక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఏకంగా.. ఓ విద్యార్థినే విషమిచ్చి చంపింది. కొడుకు క్లాస్మెట్ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. తన కుమారుడు క్లాస్ ఫస్ట్ రావాలనే ఉద్దేశ్యంతోనే మహిళ ఇలా చేసిందని పోలీస్ విచారణలో తేలింది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను ఏ విధంగా మారుస్తున్నాయో చూపేలా ఈ ఘటన ఉంది.
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత మేర పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
Read Also: Odisha: ప్రియురాలి గొంతు కోసి హత్య.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి కారైక్కల్ లో ఈ ఘటన జరిగింది. తన కుమారుడి కన్నా ఎక్కవ మార్కులు వస్తున్నాయని సదరు మహిళ కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేసింది. 8వ తరగతి చదువుతున్న రాజేంద్రన్- మాలతి కుమారుడికి స్కూల్ వాచ్మెన్ ద్వారా విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ తరువాత విద్యార్థి మణికందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు మణికందన్.
సీసీ పుటేజీ ద్వారా ఈ కుట్రకు పాల్పడిన సహాయరాణి విక్టోరియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మొదటి నుంచి తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని పక్కకు తోసి రాజేంద్రన్-మాలతిల కుమారుడు ఫస్ట్ వస్తున్నాడనే కోపంతోనే విషమిచ్చానని నిందితురాలు అంగీకరించింది.
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత మేర పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!