Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ
- బెంగళూరులో దారుణం
- మహిళపై గ్యాంగ్ రేప్ చేసి వస్తువులు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ(27)పై ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఇంట్లో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నిందితులు.. మహిళను బెదిరించి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.25,000 నగదు ఎత్తుకెళ్లారు. ప్రాణాలతో బయటపడిన పెద్ద కొడుకు తెల్లవారుజామున 12:30 గంటలకు ఎమర్జెన్సీ కాల్ చేయడంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్లు హతం
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
బెంగళూరు రూరల్లోని గంగొండనహళ్లిలోని ఒక ఇంట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ నివాసం ఉంటుంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం తలుపు తెరవమని అడిగి లోపలికి చొరబడ్డారు. అనంతరం బెదిరించి మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 9:15 గంటల నుంచి అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. పెద్ద కొడుకు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నిందితులు కూడా స్థానిక నివాసితులుగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Tuni Minor Rape: తుని అత్యాచారం కేసు.. చెరువులోకి దూకిన నిందితుడు..
ఐదుగురు నిందితుల్లో ముగ్గురు కార్తీక్, గ్లెన్, సుయోగ్గా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులు.. బాధిత కుటుంబానికి పరిచయం ఉన్నవారేనా? లేదంటే గ్యాంగ్ పనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మిగతా నిందితుల కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులపై సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Shriya Saran : శ్రియ పిచ్చెక్కించే అందాలు.. చూస్తే అంతే
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!