Site icon NTV Telugu

Pahalgam Terror Attack: పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్.. తీవ్రంగా మండిపడిన మహిళా కమిషన్

Himanshi

Himanshi

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్‌ చేయడం మంచిది కాదని తెలిపింది. అయితే, ఏప్రిల్ 22వ తేదీన జరిగిన దాడిలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా కామెంట్స్ చేయొద్దని ఆయన సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేసింది. ఈ మాటలు కొందరు నెటిజన్స్ కు నచ్చలేదు.. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.. ఆమెను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు.. దీనిపై కేంద్రం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేసిన తరుణంలోనే మహిళా కమిషన్ రియాక్ట్ అయింది.

Read Also: Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..

ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో ఎన్నో కుటుంబాలకు తీరని లోటు ఏర్పడింది అని మహిళ కమిషన్ తెలిపింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను కూడా మతం అడిగి, ప్రాణాలు తీశారు.. ఉగ్రదాడిపై దేశం మొత్తం కోపంగా ఉంది.. ఈ క్రమంలో ఆయన భార్య హిమాన్షి నర్వాల్ చేసిన వ్యా్ఖ్యలపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదు.. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా, రాజ్యాంగ విలువలకు లోబడి ఉండాలని సూచించింది. జాతీయ కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వెల్లడించింది.

Exit mobile version