Pakistan: “మాది సింధు నాగరికత”.. నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
- సింధూ నాగరికతను ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..
- తామే నిజమైన వారసులం అంటూ వింత వాదన..
- సింధు జలాలపై హక్కులు పొందే ఉద్దేశమేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్కు ‘‘సింధూ నది జలాల ఒప్పందం’’ను నిలిపేయడం ద్వారా భారత్ షాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు నీటి కోసం పాకిస్తాన్ కొత్త పథకాన్ని వేస్తోంది. తన ప్రాచీన చరిత్రను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు ఇస్లామిక్ చరిత్రను తమ జాతీయ గుర్తింపుగా మార్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ‘‘సింధు లోయ నాగరికత’’ను ముందుకు తీసుకువస్తోంది. మొహెంజోదారో, హరప్పా, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ప్రచారం చేస్తోంది. క్రీ.శ. 712లో ముహమ్మద్ బిన్ ఖాసిం జరిపిన సింధ్ విజయంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి విద్యార్థులకు బోధించిన పాకిస్థాన్, ఇప్పుడు సింధు లోయ నాగరికతను ముందుకు తెస్తోంది.
ఇటీవల, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. సింధూ నదిపై పాకిస్తాన్కు చారిత్రక హక్కు ఉందని ప్రకటించారు. మొహెంజోదారో, హరప్పా వంటి సింధూ నాగరికత కేంద్రాలు పాక్లో ఉన్నందున, ఆ నాగరికతనకు తామే నిజమైన వారసులమని చెప్పాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా సింధూ నాగరికత ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. మొహెంజోదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని నెలలకే, అంటే జూన్ 2025లో ఈ 5,000 ఏళ్ల నాటి నగరంలో తవ్వకాలు మొదలయ్యాయి.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
పాక్ చేస్తున్న వాదనల్ని భారత చరిత్రకారులు తిప్పికొడుతున్నారు. పాక్ చేస్తున్న వాదనలు సరికావని అంటున్నారు. సింధు నాగరికతకు చెందిన అనేక ప్రాంతాలు భారత్లో కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఘగ్గర్-హక్రా నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా అవశేషాలు లభించాయని చెబుతున్నారు. అందుకే “ఇండస్ వ్యాలీ సివిలైజేషన్” కంటే “ఇండస్-సరస్వతి నాగరికత” అనే పదాన్ని ఉపయోగించాలని భారతీయ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!