What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* IPL 2026: నేడు రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌.. రాత్రి 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా మ్యాచ్‌

* నేడు బెంగాల్‌లో కొలువుదీరనున్న బీజేపీ సర్కార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి.. ఇవాళ ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం

* కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సీఎం అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్‌ అధిష్టానం

* అమరావతి: ఇవాళ కోల్‌కతా పర్యటనకు సీఎం చంద్రబాబు.. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం..

* తూర్పు గోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన “పది కోర్టుల సముదాయ భవనం” ప్రారంభోత్సవం.. కోర్టు భవనం ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్

* విశాఖ: కైలాసగిరిపై మరో పర్యాటక ఆకర్షణ.. నేటి నుంచి సందర్శకులు అందుబాటులోకి భారీ త్రిశూలం.. 65 అడుగుల ఎత్తులో త్రిశూలం, ఢమరుకం నిర్మించిన VMRDA

* తూర్పుగోదావరి: ఇవాళ రాజమండ్రిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ భద్రతపై నెలకొన్న ఆందోళనలకు సంబంధించిన ఆధారాలను పీపీఏ కు పంపించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇవాళ సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించిన పోలవరం ప్రాజెక్టు అధికారులు.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం వద్ద ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం

* అనంతపురం: రాయదుర్గంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వసంతోత్సవం.. సాయంకాలం స్వామివారి మయూర వాహన సేవలు.

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,222 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 33,188 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు