* అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతి ప్రాంతం ఖరారు, చట్టబద్ధతకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం.
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
* కాకినాడ: నేటి నుంచి అన్నవరం లో శ్రీ రామ నవమి వేడుకలు.. సత్య దేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహణ.. రేపు ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం
* నేటి నుంచి కాకినాడలో మూడు రోజులపాటు ఎగుమతుల ప్రోత్సాహక సదస్సు.. ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ.. సదస్సు కి హాజరుకానున్న ఇంటర్నేషనల్ కొనుగోలుదారులు.. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్ టైల్స్ రంగాలకు సంబంధించి బిజినెస్ రిలేషన్స్ పై చర్చ
* నేడు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, పబ్లిక్ గ్రీవెన్స్ బిల్డింగ్ ను ప్రారంభించనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్త.
* గుంటూరు: నేడు బీఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంఖుస్థాపన, పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి.
* తిరుమల: 30 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,411 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,474 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు
* విజయవాడ: లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి, ప్రణయ్ ప్రకాష్ కస్టడీ నేటితో పూర్తి.. ఇవాళ ఇద్దరిని కోర్టులో హాజరుపర్చనున్న సెట్
* చిత్తూరు జిల్లా: కుప్పంలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన.. శాంతిపురం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్న భువనేశ్వరి.. గుండిశెట్టిపల్లిలో ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబసభ్యులను పరామర్శించనున్న భువనేశ్వరి.. రామకుప్పం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న భువనేశ్వరి.. బల్ల గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం .. రాత్రి 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం
* నిజామాబాద్: నేటి నుంచి పసుపు కొనుగోళ్లు బంద్. నాలుగు రోజుల పాటు మార్కెట్ కు పసుపు తీసుకురావొద్దు అంటూ అధికారుల ప్రకటన.. శ్రీరామ నవమి నేపథ్యంలో మార్కెట్ లో మూడు రోజుల పాటు సెలవు, ఆదివారం ఆదరణ సెలవు. సోమవారం యథావిధిగా పసుపు క్రయవిక్రయాలు : మార్కెట్ అధికారులు.
* భద్రాద్రి: నేటి సాయంత్రం ఉత్తర ద్వార దర్శనం వద్ద సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు.. గరుడ వాహన సేవ….
* రేపు భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు .. 586 కోట్లతో భద్రాచలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* రాజన్న సిరిసిల్ల జిల్లా: రేపు శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైన వేములవాడ రాజన్న క్షేత్రం.. ఆలయ ప్రాంగణంలోని శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణం .. రాములోరి కళ్యాణానికి
వేలాదిగా తరలిరానున్న భక్తులు.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న ఆలయ అధికారులు
