Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా బెంగాల్ పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు బీజేపీ చెక్ పెడుతుందా.? మళ్లీ దీదీనే గెలుస్తుందా? అనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, చాలా వరకు ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నాయి.
Read Also: Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల
తాజాగా విడుదలైన మాట్రిజ్, చాణక్యపోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో బీజేపీతో పోలిస్తే టీఎంసీ స్వల్ప తేడాతో ముందంజలో ఉందని చెబుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ సహా మిగిలిన చిన్నాచితక పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతున్నాయి.
మాట్రిజ్ అంచనా ప్రకారం.. టీఎంసీకి 43 శాతం, బీజేపీకి 41 శాతం, ఇతరులకు 16 శాతం ఓట్ షేర్ వస్తుందని చెప్పింది. బీజేపీ టీఎంసీ కన్నా 2 శాతం స్వల్ప తేడాతో వెనకబడి ఉందని, ఓటర్ల మనోభావాల్లో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా తుది ఫలితాన్ని మార్చుతుందని చెప్పింది. సీట్ల పరంగా చూస్తే టీఎంసీకి 140-160 సీట్లు, బీజేపీకి 130-150 సీట్లు, ఇతరులకు 8-16 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బెంగాల్లో సంచలనం సృష్టించేందుకు బీజేపీ కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉందని ఓపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 110-115 సీట్లు, టీఎంసీ 155-165 సీట్లు, ఇతరులు 9-14 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది.