West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..

  • ఫల్తా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
  • మమతా మేనల్లుడిని కుంచకోటపై బీజేపీ చూపు..
West Bengal

West Bengal

West Bengal Re-Poll: పశ్చిమ బెంగాల్‌లో ఫల్తా నియోజకవర్గానికి నిర్వహించిన రీ పోలింగ్ ఫలితం ఈ రోజుతో తెలియబోతోంది. మే 21న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 86.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 29న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా స్టిక్కర్స్ అంటించడం, చాలా పోలింగ్ బూతుల్లో లైవ్ వీడియో ప్రసారాలు వెల్లకుండా సీసీటీవీ కనెక్షన్లను కట్ చేయడం వంటి ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్‌కు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జరిగిన రీపోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫల్తా నియోజకవర్గంలో గెలుపు బీజేపీకి చాలా కీలకంగా మారనుంది. అందుకే కాషాయం పార్టీ ఈ గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ఓటింగ్‌కు ముందే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. టీఎంసీ రేసు నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా మధ్య పోటీ నెలకొంది. సీపీఎం నునంచి శంభునాథ్ కుర్మీ పోటీలో ఉన్నారు.

వివాదాస్పదమైన ఫల్తా అసెంబ్లీలో గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం. టీఎంసీ కీలక నేత, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎంపీ సీటు పరిధిలోనే ఫల్తా నియోజకవర్గం ఉంటుంది. చాలా కాలంగా ఈ సీటు టీఎంసీకి కంచుకోటగా ఉంది. దీంతో ఈ కోటను బద్ధలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది.