Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
- పశ్చిమ బెంగాల్లో అధికారం ఎవరిది
- ఉత్కంఠగా మారిన సర్వే సంస్థల అంచనాలు
- బీజేపీ, తృణమూల్ మధ్య నెక్ టు నెక్ ఫైట్
Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో చారిత్రక మలుపు రాబోతోందా.. దశాబ్దాల పాటు ‘ఎరుపు’ (లెఫ్ట్) జెండా రెపరెపలాడిన ఈ గడ్డపై, ఆ పార్టీలను గద్దె దించి అధికారంలోకి వచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా దీదీగా పిలుచుకునే మమతా బెనర్జీ. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ కోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు ‘కాషాయం’ వైపు మొగ్గు చూపుతోందా.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బెంగాల్ గడ్డపై హోరాహోరీ పోరు సాగినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఈ దఫా అధికార పగ్గాలను చేజిక్కించుకునేది ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిరేపుతుంది.
పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది? మమతా బెనర్జీ హ్యాట్రిక్ తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతోందా? తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు బీజేపీ – తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య ‘నెక్-టు-నెక్’ ఫైట్ ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.
Also Read
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
బెంగాల్లోని 294 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఉత్కంఠగా మారింది. పలు సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
JVC సర్వే: బీజేపీకి 138-159 స్థానాలు, టీఎంసీకి 131-152 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.
P-MARQ: బీజేపీ 150-175 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, టీఎంసీ 118-138 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది.
Matrize: బీజేపీకి 146-161 (42.5% ఓట్లు), టీఎంసీకి 126-135 (40.8% ఓట్లు) వస్తాయని అంచనా వేసింది.
Poll Diary: బీజేపీకి 142-171, టీఎంసీకి 99-127 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అయితే People’s Pulse మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీకి తిరుగులేదని, టీఎంసీ 177-187 స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, బీజేపీ 95-110 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పింది.
కాషాయ దళం దూకుడు.. డిఫెన్స్లో దీదీ !
2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2021 నాటికి 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు 2026లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్, జంగల్మహల్ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండగా.. ఇదే సమయంలో మమతా బెనర్జీ తన 15 ఏళ్ల పాలనపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేస్తూ, టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
మే 4న భవితవ్యం
2021 ఎన్నికల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో గెలుపోటములు 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతోనే జరిగాయి. ఈసారి కూడా అతి తక్కువ ఓట్ల శాతం అటు ఇటూ అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ మార్పులకు కారణం కావచ్చు వారు చెబుతున్నారు. ఎరుపు జెండాల స్థానంలో పచ్చ తోరణాలు వచ్చి చేరిన బెంగాల్ గడ్డపై, ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతాయా? లేకపోతే మళ్లీ మమతా బెనర్జీ పార్టీ జెండాలే కనబడుతాయా? అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!