Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
- పశ్చిమ బెంగాల్లో అధికారం ఎవరిది
- ఉత్కంఠగా మారిన సర్వే సంస్థల అంచనాలు
- బీజేపీ, తృణమూల్ మధ్య నెక్ టు నెక్ ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో చారిత్రక మలుపు రాబోతోందా.. దశాబ్దాల పాటు ‘ఎరుపు’ (లెఫ్ట్) జెండా రెపరెపలాడిన ఈ గడ్డపై, ఆ పార్టీలను గద్దె దించి అధికారంలోకి వచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా దీదీగా పిలుచుకునే మమతా బెనర్జీ. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ కోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు ‘కాషాయం’ వైపు మొగ్గు చూపుతోందా.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బెంగాల్ గడ్డపై హోరాహోరీ పోరు సాగినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఈ దఫా అధికార పగ్గాలను చేజిక్కించుకునేది ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిరేపుతుంది.
పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది? మమతా బెనర్జీ హ్యాట్రిక్ తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతోందా? తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు బీజేపీ – తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య ‘నెక్-టు-నెక్’ ఫైట్ ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.
Also Read
- Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
బెంగాల్లోని 294 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఉత్కంఠగా మారింది. పలు సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
JVC సర్వే: బీజేపీకి 138-159 స్థానాలు, టీఎంసీకి 131-152 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.
P-MARQ: బీజేపీ 150-175 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, టీఎంసీ 118-138 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది.
Matrize: బీజేపీకి 146-161 (42.5% ఓట్లు), టీఎంసీకి 126-135 (40.8% ఓట్లు) వస్తాయని అంచనా వేసింది.
Poll Diary: బీజేపీకి 142-171, టీఎంసీకి 99-127 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అయితే People’s Pulse మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీకి తిరుగులేదని, టీఎంసీ 177-187 స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, బీజేపీ 95-110 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పింది.
కాషాయ దళం దూకుడు.. డిఫెన్స్లో దీదీ !
2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2021 నాటికి 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు 2026లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్, జంగల్మహల్ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండగా.. ఇదే సమయంలో మమతా బెనర్జీ తన 15 ఏళ్ల పాలనపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేస్తూ, టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
మే 4న భవితవ్యం
2021 ఎన్నికల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో గెలుపోటములు 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతోనే జరిగాయి. ఈసారి కూడా అతి తక్కువ ఓట్ల శాతం అటు ఇటూ అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ మార్పులకు కారణం కావచ్చు వారు చెబుతున్నారు. ఎరుపు జెండాల స్థానంలో పచ్చ తోరణాలు వచ్చి చేరిన బెంగాల్ గడ్డపై, ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతాయా? లేకపోతే మళ్లీ మమతా బెనర్జీ పార్టీ జెండాలే కనబడుతాయా? అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
-
Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Maa Inti Bangaram: నా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. సామ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
-
Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!