West Bengal Election Results: బెంగాల్ ఫలితాల్లో ఏడు ‘M ఫ్యాక్టర్స్’ ప్రభావం.. ఎవరికీ పైచేయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ, బీజేపీ మరియు టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. తొలి ట్రెండ్స్ నుంచే రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడం, ఈ ఎన్నికల్లో ‘M ఫ్యాక్టర్స్’ ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మొత్తం 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, కొన్నిసార్లు బీజేపీ ఆధిక్యం సాధిస్తున్నట్లు కనిపిస్తుండగా, మరికొన్ని సార్లు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తిరిగి పోటీలోకి వస్తోంది. తాజా ట్రెండ్స్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటినట్లు సమాచారం. ఇదే ట్రెండ్ కొనసాగితే, అది బీజేపీకి చారిత్రాత్మక విజయంగా నిలవొచ్చు.
* ఈ ఎన్నికల అసలు కథ కేవలం సీట్ల పోరుతో మాత్రమే పరిమితం కాలేదు. బెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఏడు కీలక ‘M ఫ్యాక్టర్స్’ ఇప్పుడు ఫలితాలను నిర్ణయించే స్థాయికి చేరాయి. మొదటిగా, ముస్లిం ఓటు బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో సుమారు 30 శాతం ఉన్న ఈ వర్గం ఓట్లు అనేక నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా మారాయి. సాంప్రదాయకంగా టీఎంసీకి అనుకూలంగా ఉన్న ఈ ఓటు బ్యాంక్లో ఈసారి కొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- Kulgam: కుల్గామ్లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
- Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
- Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
* రెండవది మహిళా ఓటు. మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళలను ఆకర్షించగా, మరోవైపు మహిళల భద్రత వంటి అంశాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది. దీంతో మహిళా ఓటర్లు ఈసారి కింగ్మేకర్లుగా మారినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
* మూడవది వలస కార్మికుల ప్రభావం. బెంగాల్ వెలుపల పనిచేస్తున్న లక్షలాది మంది తిరిగి వచ్చి ఓటు వేయడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక అంశంగా నిలిచింది. ఉపాధి, అభివృద్ధి అంశాలు ఈ వర్గం ఓటింగ్పై ప్రభావం చూపించాయి.
* నాలుగవది మతువా సమాజం ఓటు. ఉత్తర 24 పరగణాలు ప్రాంతంలో ఈ వర్గం ఓటు కీలకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై ఉన్న అంచనాలు ఈ వర్గం ఓటింగ్ ధోరణిని ప్రభావితం చేశాయి.
* ఐదవది యంత్రాంగం లేదా సంస్థాగత బలం. బీజేపీ గత కొన్నేళ్లుగా తన కేడర్ను బలోపేతం చేసుకోగా, టీఎంసీకి ఇప్పటికే బలమైన స్థాయి నెట్వర్క్ ఉంది. బూత్ స్థాయి నిర్వహణలో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది.
* ఆరవది మమతా ఫ్యాక్టర్. మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రజాదరణ, ఆమె రాజకీయ శైలి టీఎంసీకి ప్రధాన బలంగా నిలిచింది. ఈ ఎన్నికలు ‘దీదీ వర్సెస్ మిగతావాళ్లు’ అనే భావోద్వేగాన్ని కూడా సృష్టించాయి.
* ఏడోవది మోడీ ఫ్యాక్టర్. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలు, కేంద్ర పథకాలు, ఆయన వ్యక్తిగత ప్రభావం బీజేపీకి గణనీయమైన మద్దతును తెచ్చాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
మొత్తంగా ఈ ఏడు ‘M ఫ్యాక్టర్స్’ ఈసారి బెంగాల్ ఎన్నికల ఫలితాలను తీర్చిదిద్దుతున్నాయి. చివరికి ఈ అంశాలు ఎవరికీ అనుకూలిస్తాయో, ఎవరు అధికారాన్ని చేపడతారో అన్నది తేలడానికి రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!