West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
- బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఉక్కుపాదం..
- కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం సువేందు అధికారి..
- సరిహద్దుల్లో బారులు తీరుతున్న బంగ్లాదేశీయులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో భయం మొదలైంది. వలసలపై సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ‘‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” విధానాన్ని బెంగాల్ ప్రభుత్వం అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఇన్నాళ్లు అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులు, సొంత దేశానికి వెళ్లేందుకు సరిహద్దుల్లో క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర పరగణాలు, మాల్దా జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బషీర్హాట్ సబ్డివిజన్లోని హకీంపూర్ చెక్పోస్టు వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు గుమిగూడారు.
ఇలా వెళ్తున్నవారిలో చాలా మంది అక్రమంగా భారత్లో నివసిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్రమ వలసదారుల్ని నిర్బంధించాలని ఆదేశించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సీఎం సువేందు అధికారి అక్రమంగా ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వారిని అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్కు అప్పగిస్తారని తెలిపారు.
Also Read
- UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
- Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
- AIADMK Crisis: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. అన్నాడీఎంకేలో మళ్లీ సంక్షోభం.. ఈపీఎస్కు డెడ్లైన్..!
- Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
ఈ నేపథ్యంలో మాల్దా జిల్లాలో హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ బజార్లోని చందన్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డిటెన్షన్ సెంటర్లో 9 మంది అనుమానిత బంగ్లాదేశీయుల్ని ఉంచారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు మైనర్లు ఉన్నారు. ఈ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు సీసీటీవీ నిఘా, పోలీస్, సివిల్ డిఫెన్స్ బృందాలు సెక్యూరిటీని నిర్వహిస్తున్నాయి. వీరి పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత వారి దేశానికి పంపించే ప్రక్రియ ప్రారంభిస్తారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్లో శుభ్మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!