Waqf Bill: వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఆమోదం.. ప్రతిపక్షాలకు షాక్..
- వక్ఫ్ బిల్లుకు పార్లమెంటరీ కమిటీ ఆమోదం..
- వీగిపోయిన ప్రతిపక్షాల సవరణలు..
- ఎన్డీయే సభ్యుల సవరణలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కమిటీలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన అన్ని సవరణలకు జేపీసీ ఆమోదం తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ప్రతీ మార్పును కమిటీ తిరస్కరించింది. బిల్లులో 14 నిబంధనలలో ఎన్డీయే సభ్యులు ప్రతిపాధించిన సవరణలు ఆమోదించినట్లు పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్ అయిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.
వక్ఫ్ ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లు కొందరిని అపాయింట్ చేయడానికి అధికారం ఇవ్వడంతో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్లో సభ్యులను రెండు నుంచి మూడుకు పెంచడం వంటి సవరణలు ఉన్నాయి. ఈ రోజు క్లాజుల వారీగా జరిగి ఓటింగ్లో అధికార ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎంపీలు సవరణకు అనుకూలంగా ఓటేయగా, 10 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో మొత్తం 44 నిబంధనలను చర్చించగా, ప్రతిపక్షాలు చేసిన సవరణలు 10:16 మెజారిటీలో వీగిపోయాయి.
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
జనవరి 28 నాటికి ముసాయిదా నివేదిక పంపణీ చేస్తామని, ఆ తర్వాత జనవరి 29న అధికారికంగా ఆమోదం తెలుపుతామని జేపీసీ ప్రకటించింది. ప్రతిపక్ష ఎంపీలు జేపీసీని విమర్శిస్తున్నారు. జగదాంబికా పాల్ ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కారని ఆరోపించారు. ఆయన నియంతృత్వ ధోరణితో వ్యవహరించాలని టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీ విలేకరులతో అన్నారు. అయితే, జగదాంబికా పాల్ ఈ ఆరోపణల్ని తిరస్కరించారు.
వక్ఫ్ బోర్డు నియంతృత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు-2024ను ఆగస్టు 08న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, విరణాత్మక పరిశీలన కోసం మరింత గడువు పెంచారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..