Virender Sehwag: మనసున్నోడు మా వీరు.. రైలు ప్రమాదంలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag: ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన అందర్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 270కి పైగా మంది చనిపోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ ప్రమాదంపై సెలబ్రెటీలు చలించిపోతున్నారు. వివిధ దేశాని నేతలు, ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మిగిలిన పిల్లలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also: Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
ఇప్పటికే ప్రముఖ బిలియనీర్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు. ఉచితంగా విద్యను అందిస్తానని ప్రకటించారు. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అనాథలైన పిల్లలను అదుకునేందుకు ముందుకు వచ్చారు. తన స్కూల్ లో ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ చిత్రం చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద సమయంలో, ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడమే నేను చేయగలిగింది. నేను అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ సదుపాయంలో ఉచిత విద్యను అందిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు- షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. మూడు దశాబ్ధాల రైల్వే చరిత్రలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదంగా నిలిచింది. మరోవైపు ఈ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility 🙏🏼 pic.twitter.com/b9DAuWEoTy
— Virrender Sehwag (@virendersehwag) June 4, 2023
తాజావార్తలు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!