Vikram 3201: భారత తొలి ‘‘మైక్రోప్రాసెసర్’’ ఆవిష్కరణ, “విక్రమ్ 3201” ప్రత్యేకతలు ఇవే..
- భారత తొలి మైక్రోప్రాసెసర్ ‘‘విక్రమ్’’ ఆవిష్కరణ..
- సెమీకండక్లర్ రంగంలో ‘‘ఆత్మనిర్భర్’’ దిశగా ఇండియా..
- అంతరిక్ష రంగంలో కీలకంగా మారనున్న స్వదేశీ మైక్రోచిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram 3201: భారత్ పూర్తిగా స్వదేశీ అయిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘‘విక్రమ్’’ను ఆవిష్కరించింది. ప్రస్తుత డిజిటల్ యుగంతో మైక్రోప్రాసెసర్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రతీ రంగంలో ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ రంగంలోకి భారత్ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశం నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఈ మైక్రోచిప్ని మంగళవారం ఆవిష్కరించారు. వీటిని ‘‘డిజిటర్ వజ్రాలు’’గా ప్రధాని పిలిచారు. డిజిటల్ యుగంలో ప్రపంచంలో మైక్రోప్రాసెసర్ల ప్రాముఖ్యతను ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.
ఈ రంగంలో ఇప్పటి వరకు తైవాన్, చైనా, దక్షిణ కొరియా, అమెరికా గుత్తాధిపత్యం నడిచేది. ఇప్పుడు భారత్ కూడా ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లైంది. మన చేతి గడియారం నుంచి శాటిలైట్లు, రాకెట్లు ఇలా ప్రతీ దాంట్లో ఈ మైక్రోప్రాసెసర్లు చాలా కీలకం. ఇప్పుడు భారత్ సెమీకండక్టర్, మైక్రోప్రాసెసర్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం అంచనా వేసిన 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని దాటుతుందని అంచనా. భారత్లో సెమీకండర్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: 2020 Delhi riots: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరణ..
భారతదేశ ‘విక్రమ్’ మైక్రోప్రాసెసర్ ప్రత్యేకతలు ఇవే:
విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, ఇది దేశీయ తొలి 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. విక్రమ్32 అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. ఇది -55 డిగ్రీ సెల్సియస్ నుంచి 125 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.
అయితే, ఇది సాధారణ ల్యాప్లాప్లో ఉపయోగించే చిప్ సెట్ కాదు, దీనిని పూర్తిగా అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించారు. రాకెట్స్, శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ వంటి పరికరాల్లో దీనిని వినియోగించనున్నారు. 2009లో విడుదలైన విక్రమ్-1601కి ఇది అప్గ్రేడ్ వెర్షన్గా భావించవచ్చు.
ఇది కస్టమ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్తో కూడిన 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఒకేసారి 32 బిట్ల డేటాను నిర్వహించగలదు. అనేక రకాల ఆర్డర్లను అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు. అంటే ఇది ఇన్స్ట్రక్షన్ సెంట్ ఆర్కిటెక్చర్ లేదా ఐఎస్ఏ. ఇది Ada ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి హైలెవల్ సపోర్టు ఇస్తుంది.
అంతరిక్ష వాతావరణం చాలా సున్నితంగా ఉంటుంది. రాకెట్స్ సరైన మార్గంలో ప్రయాణించేందుకు, శాటిలైట్ సరైన కక్ష్యలో చేరేందుకు ఈ చిప్సెట్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ చిప్ని మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో రూపొందించారు. విక్రమ్-32ను పీఎస్ఎల్వీ-సీ60 మిషన్లో ఉపయోగించి అంతరిక్షంలో పరీక్షించారు. ఆర్బిటల్ ఎక్స్పర్మెంట్ మాడ్యూల్లో మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్గా దీనిని అమలు చేసిన తర్వాత ఇస్రోకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇది వరకు ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో వాడే చిప్ కోసం భారత్ విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు విక్రమ్ ఆవిష్కరణతో భారత్ ‘‘ఆత్మ నిర్భర్’’గా మారినట్లు అయింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!