President Elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఫైనల్..? కాసేపట్లో ప్రకటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాబోయే రాష్ట్రపతి ఎవరు..? అధికార పార్టీ అభ్యర్థి ఎవరు..? విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేదెవరు..? ఇలాంటి ప్రశ్నలకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది.. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం. వెంకయ్యనాయుడు.. తదుపరి రాష్ట్రపతిగా పోటీకి పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… తదుపరి రాష్ట్రపతి వెంకయ్యనాయుడే అనే చర్చ సాగుతోంది.. ఆయనతో ఇవాళ హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. రాష్ట్రపతి ఎన్నికలపై కీలకమైన పార్టీ సమావేశానికి ముందు అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. రాజ్యాంగ అత్యున్నత పదవికి బీజేపీ అధిష్టానం నాయుడును పరిశీలిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది..
మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలతో సహా వివిధ పార్టీలతో మాట్లాడేందుకు రాజ్నాథ్ సింగ్ మరియు జేపీ నడ్డాలకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్న నేపథ్యంలో నాయుడుతో కేంద్రమంత్రులు, బీజేపీ చీఫ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లో ఉన్న వెంకయ్యనాయుడు.. ఉదయం సికింద్రాబాద్లో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన హస్తినకు వెళ్లారు.. ఆ తర్వాత అమిత్ షా, రాజ్నాథ్ సింత్, జేపీ నడ్డా.. ఆయన్ను ఇంటికి వెళ్లి కలిశారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరా భేటీ జరిగింది.. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ జరగడానికి ముందు.. వెంకయ్య ఇంట్లో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పలువురు పేర్లు వినిపిస్తున్నా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రముఖంగా చర్చసాగుతోంది.. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఆయనతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, దాదాపు.. కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అధికారపార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. మరోవైపు, విపక్షాల అభ్యర్థి కూడా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!