Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదనే నిబంధనలు విధించామని వెల్లడించారు.
ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల లైంగిక నేరాలకు పాల్పడిన వారు సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా.. సాక్ష్యాలను తారుమారు చేయకుండా నివారించవచ్చని ఖన్నా అన్నారు. నిందితులు, బాధితురాలిని, ఇతర సాక్ష్యులను బెదిరించకుండా.. వేధించకుండా ఈ బిల్లు సహాయపడుతుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ(సవరణ) బిల్లును కూడా యూపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దావా వేయడానికి ఇప్పుడున్న మూడు నెలలను మూడేళ్ల వరకు పొడగిస్తుంది.
Also Read
Read Also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్
అల్లర్లలో ఎవరైనా చనిపోతే వారికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేలా క్లెయిమ్ ట్రిబ్యునల్ కు ఈ సవరణ బిల్లు అధికారాన్ని కల్పించనుంది. బాధితుడికి దోషి నుంచి పరిహారం అందేలా.. సొమ్మును రికవరీ చేసేలా ఈ బిల్లు అధికారాన్ని కల్పిస్తోంది. ఆందోళనలు, అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడు వ్యక్తి పరిహారం కోసం అప్పీల్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ట్రిబ్యునల్ అలాంటి కేసులను సుమోటోగా గుర్తించే హక్కు కూడా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల చర్యలకు అయ్యే ఖర్చును కూడా దోషులే భరించాలని బిల్లులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుడి నుంచి వసూలు చేయడానికి 2020లో యూపీ ప్రభుత్వం ‘‘ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్’ను తీసుకువచ్చింది. తాజాగా దీనికి సవరణలు చేశారు. ఈ బిల్లుల సమయంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు గైర్హాజరు అయ్యాయి.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..