Uttar Pradesh: గుర్తింపు లేని మదర్సాల సర్వేపై మాకు అభ్యంతరం లేదన్న “జమియత్ ఉలామా ఏ హింద్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madrasa survey in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సాలపై సర్వే చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించని మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పక్షాల నుంచి దీనిపై అభ్యంతరం వచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సర్వేను మినీ ఎన్నార్సీగా అభివర్ణించారు. అయితే గుర్తింపులేని మదర్సాల సర్వే విషయంలో మాకు ఏం అభ్యంతరం లేదని జమియత్ ఉలామా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఆదివారం తెలిపారు. మదర్సాల సర్వేపై మాకు అభ్యంతరం లేదని.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఉలేమాలు సమాధానం ఇవ్వాలని.. ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించాలని మదానీ అన్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో సినిమా థియేటర్లు ప్రారంభం.. 1990 తర్వాత ఇప్పుడే తొలిసారి
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
దారుల్ ఉలూమ్, దేవ్బంద్లో మదర్సాల సమ్మేళంన జరిగిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. సర్వే విషయంలో మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని మదానీ అన్నారు. మదర్సాలు తమ నిబంధనలను, ఖాతాలను సక్రమంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సర్వేపై ముస్లిం సమాజంలో ఎలాంటి ఆగ్రహం లేదని.. ముస్లింల విరాళాలతో మదర్సాలను నడుపుతున్నామని.. ఏదైనా మదర్సాలో పిల్లలపై అఘాయిత్యాలు జరిగితే తనిఖీ చేయవచ్చని.. వ్యతిరేకంగా ఏ సమాచారం దొరికినా.. దాన్ని మూసేవచ్చని ఆయన అన్నారు.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని మదర్సాల సర్వేపై ఉత్తర్ ప్రదేశ్ లో మదర్సాల సమ్మేళనం జరిగింది. దీనికి 250 మందికిపైగా మదర్సాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 12 అంశాల ఆధారంగా సర్వే చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠ్యాంశాలు, ప్రభుత్వేతర సంస్థలతో మదర్సాల అనుబంధం గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మదర్సాల సర్వేను చేపట్టింది ప్రభుత్వం. అయితే ఈ చర్యలను అసద్దుదీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్న మదర్సాల సర్వే ముస్లిం సమాజంపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీన్ని మినీ ఎన్సార్సీ అని అన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!