Uttar Pradesh: గుర్తింపు లేని మదర్సాల సర్వేపై మాకు అభ్యంతరం లేదన్న “జమియత్ ఉలామా ఏ హింద్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madrasa survey in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సాలపై సర్వే చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించని మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పక్షాల నుంచి దీనిపై అభ్యంతరం వచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సర్వేను మినీ ఎన్నార్సీగా అభివర్ణించారు. అయితే గుర్తింపులేని మదర్సాల సర్వే విషయంలో మాకు ఏం అభ్యంతరం లేదని జమియత్ ఉలామా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఆదివారం తెలిపారు. మదర్సాల సర్వేపై మాకు అభ్యంతరం లేదని.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఉలేమాలు సమాధానం ఇవ్వాలని.. ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించాలని మదానీ అన్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో సినిమా థియేటర్లు ప్రారంభం.. 1990 తర్వాత ఇప్పుడే తొలిసారి
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
దారుల్ ఉలూమ్, దేవ్బంద్లో మదర్సాల సమ్మేళంన జరిగిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. సర్వే విషయంలో మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని మదానీ అన్నారు. మదర్సాలు తమ నిబంధనలను, ఖాతాలను సక్రమంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సర్వేపై ముస్లిం సమాజంలో ఎలాంటి ఆగ్రహం లేదని.. ముస్లింల విరాళాలతో మదర్సాలను నడుపుతున్నామని.. ఏదైనా మదర్సాలో పిల్లలపై అఘాయిత్యాలు జరిగితే తనిఖీ చేయవచ్చని.. వ్యతిరేకంగా ఏ సమాచారం దొరికినా.. దాన్ని మూసేవచ్చని ఆయన అన్నారు.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని మదర్సాల సర్వేపై ఉత్తర్ ప్రదేశ్ లో మదర్సాల సమ్మేళనం జరిగింది. దీనికి 250 మందికిపైగా మదర్సాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 12 అంశాల ఆధారంగా సర్వే చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠ్యాంశాలు, ప్రభుత్వేతర సంస్థలతో మదర్సాల అనుబంధం గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మదర్సాల సర్వేను చేపట్టింది ప్రభుత్వం. అయితే ఈ చర్యలను అసద్దుదీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్న మదర్సాల సర్వే ముస్లిం సమాజంపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీన్ని మినీ ఎన్సార్సీ అని అన్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!