PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం యొక్క శక్తి, చైతన్యానికి ప్రతిబింబం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత పెరిగేందుకు, వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడానికి తన అమెరికా పర్యటన ఒక అవకాశం అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలిసి బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తన పర్యటన న్యూయార్క్ నుండి ప్రారంభమవుతుందని, అక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటానని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించాలన్న భారతదేశ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన ప్రదేశంలో వేడుకలు జరుగుతాయని మోడీ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటున్నట్లు ప్రకటనలో చెప్పారు.
భారత్-అమెరికా సంబంధాలు బహుముఖంగా ఉన్నాయని.. వస్తువులు, సేవల్లో అమెరికా భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, సైన్ అండ్ టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రత రంగాల్లో సన్నిహితంగా సహకరించుకుంటాని మోడీ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని పలు కంపెనీల సీఈఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దీంతో పాటు ఇండియా-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో ప్రధాని పర్యటన జరగనుంది. ఆ తరువాత జూన్ 23,24 తేదీల్లో ఈజిప్టులో పర్యటించనున్నారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా ఆయన ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
Leaving for USA, where I will attend programmes in New York City and Washington DC. These programmes include Yoga Day celebrations at the @UN HQ, talks with @POTUS @JoeBiden, address to the Joint Session of the US Congress and more. https://t.co/gRlFeZKNXR
— Narendra Modi (@narendramodi) June 20, 2023
తాజావార్తలు
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!