PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం యొక్క శక్తి, చైతన్యానికి ప్రతిబింబం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత పెరిగేందుకు, వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడానికి తన అమెరికా పర్యటన ఒక అవకాశం అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలిసి బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తన పర్యటన న్యూయార్క్ నుండి ప్రారంభమవుతుందని, అక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటానని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించాలన్న భారతదేశ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన ప్రదేశంలో వేడుకలు జరుగుతాయని మోడీ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటున్నట్లు ప్రకటనలో చెప్పారు.
భారత్-అమెరికా సంబంధాలు బహుముఖంగా ఉన్నాయని.. వస్తువులు, సేవల్లో అమెరికా భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, సైన్ అండ్ టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రత రంగాల్లో సన్నిహితంగా సహకరించుకుంటాని మోడీ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని పలు కంపెనీల సీఈఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దీంతో పాటు ఇండియా-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో ప్రధాని పర్యటన జరగనుంది. ఆ తరువాత జూన్ 23,24 తేదీల్లో ఈజిప్టులో పర్యటించనున్నారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా ఆయన ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
Leaving for USA, where I will attend programmes in New York City and Washington DC. These programmes include Yoga Day celebrations at the @UN HQ, talks with @POTUS @JoeBiden, address to the Joint Session of the US Congress and more. https://t.co/gRlFeZKNXR
— Narendra Modi (@narendramodi) June 20, 2023
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!