Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…
- ముఖ్యమంత్రి కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ
- అడ్డుకున్న పోలీసులు, పీఎస్ కు తరలింపు
- రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సీఎం నివాసానికి దగ్గరలో ఓ మహిళ చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ, బాధితురాలు తన నుంచి రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పింది. పోలీసులు తన మాట వినకపోవడంతో.. తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నదా మహిళ.
లక్నోలోని గౌతమ్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సీఎం నివాసం సమీపంలో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె దగ్గర ఉన్న బ్యాగులో కిరోసిన్ తో నింపిన బాటిల్ ను తెచ్చుకుని.. తలపై పోసుకుంది. అంటించుకునే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్దోయ్లోని పిహానీకి చెందిన రోలీ దేవి అనే మహిళ నుంచి హర్దోయ్కు చెందిన విక్కీ మిశ్రా లక్నోలో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. తన జీవితాంతం కష్టపడి ఇంటి కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని తనకిచ్చానని తెలిపింది. అయినప్పటికి ఆమె ఇల్లు రాలేదు.. డబ్బు రాలేదని ఆమె వాపోయింది.
ఇళ్లు రాకపోవడంతో మొదట విక్కీని డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇస్తానని.. తర్వాత తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. దీనిపై ఆమె పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఎవరూ తన మాట వినలేదని… చివరకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవడానికి లక్నో చేరుకున్నాని వెల్లడించింది. ఈ కేసు గురించి హర్దోయ్ పోలీసులకు సమాచారం అందించామని.. ఇన్స్పెక్టర్ రత్నేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?