Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ట్రైన్.. కొత్తగా ఈ రూట్లలో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే రైలు చేరుకోనుంది.
ఇప్పటి వరకు ప్రారంభం అయిన వందే భారత్ రైళ్లు..
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
1. ముంబై సెంట్రల్- అహ్మదాబాద్- గాంధీనగర్,
2. ముంబై- సాయినగర్ షిర్డీ,
3. ముంబై-షోలాపూర్,
4. న్యూఢిల్లీ-వారణాసి,
5. న్యూఢిల్లీ-శ్రీ వైష్ణో దేవీ మాత కట్రా,
6. అంబ్ అందౌౌరీ- న్యూ ఢిల్లీ,
7. మైసూరు – పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
8. నాగ్ పూర్-బిలాస్ పూర్
9. హౌరా-న్యూ జల్పాయ్ గురి
10. సికింద్రాబాద్-విశాఖపట్నం
11. భోపాల్-న్యూ ఢిల్లీ
కొత్తగా ప్రారంభం కాబోయే వందేభారత్ ట్రైన్స్ ఇవే..
చెన్నై-కోయంబత్తూర్ భారత్ ఎక్స్ప్రెస్
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 8, 2023న చెన్నై స్టేషన్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఇది 12వ వందేభారత్ ట్రైన్. చెన్నై నుంచి మైసూరుకు ఇప్పటికే ఓ వందే భారత్ ట్రైన్ నడుస్తోంది.
ఢిల్లీ – జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 10లోపు ఢిల్లీ-జైపూర్ నగరాల మధ్య వందేభారత్ రైల్ ప్రారంభం అవుతుందని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో కొత్తగా ఒక వందేభారత్ రైలును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో వందేభారత్ రైలు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖల మధ్య ఓ రైలు నడుస్తోంది.
పాట్నా-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్
రాంచీ (జార్ఖండ్) నుండి పాట్నా (బీహార్) మార్గంలో 15వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించే అవకాశం ఉంది. సెమీ-హై స్పీడ్ రైలు ప్రయాణాన్ని 6 గంటల్లో కవర్ చేస్తుంది మరియు ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..