Site icon NTV Telugu

Uttar Pradesh: తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అత్తపై కోడలు ఒత్తిడి.. వీడియో వైరల్..

Up

Up

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించింది ఓ కోడలు. తన అత్తగారిలో శారీరక సంబంధం పెట్టుకోవాలని చూసింది. దీని కోసం అత్తపై ఒత్తిడి తీసుకురావడంతో, సదరు మహిళ పోలీసులని ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగింది. అత్తగారిని గాఢంగా ప్రేమించడంతో పాటు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. తన కోడలు చేస్తున్న ఈ పనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత్త పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: KTR: కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే.. హైదరాబాద్కు ఆ ప్రమాదముంది..!

రెండేళ్ల క్రితం తన కొడుకుకి పెళ్లి చేసినట్లు సదరు మహిళ చెప్పింది. మొదటి నుంచి తన కోడలు ప్రవర్తన వింతగా ఉందని, తన కొడులు తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించిందని సదరు అత్త మీడియాతో చెప్పింది. తన భర్తతో కలిసి ఉండటం ఆమెకు నచ్చేది కాదని వెల్లడించింది. ఒక రోజు తన కోడలు తనను పెళ్లి చేసుకోవాని, భర్తతో కలిసి జీవించలేదని చెప్పిందని, దీంతో షాక్‌కి గురయ్యానని వెల్లడించారు. తామిద్దరం పారిపోయి, తమ భర్తలకు దూరంగా స్థిరపడదామని చెప్పేదని అత్తగారు చెప్పారు.

తనకు స్వలింగ వివాహాల కేసుల్ని చూపించి, తనతో ఉండాలని వాదించేదని, అత్తని పెళ్లి చేసుకోవడంలో తప్పేంటని వాదించేదని సదరు మహిళ ఆరోపించారు. చివరకు తన కోడలు తల్లిదండ్రుల్ని సంప్రదిస్తే ఈ విషయంలో వారు చేతులెత్తేశారని, తన కూతురితో ఇష్టం వచ్చినట్లు చేయమని కోడలు తల్లిదండ్రులు చెప్పారని చెప్పింది. తన కొడుకు మోసపోయాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కోడలు సెల్‌ఫోన్‌లో డర్టీ వీడియోలను బలవంతంగా చూపిస్తోందని, మీరు అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాన్ని బెదిరిస్తోందని చెప్పారు. ఈ విషయంలో సాయం చేయాలని పోలీసుల్ని అభ్యర్థిస్తోంది. ఆమెను తమ కుటుంబం వదిలించుకోవడానికి ప్రత్నిస్తోందని, అయితే అందకు ప్రతిగా కోడులు కుటుంబం రూ.20 లక్షలను డిమాండ్ చేస్తోందని అత్తగారు వెల్లడించారు.

Exit mobile version