UP CM Yogi Adityanath: భక్తులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్తీక పౌర్ణమి సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi Adityanath: కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ భక్తులకు సందేశం ఇచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ పవిత్ర స్నానాలు కొనసాగనున్నాయి. దీంతో కార్తీక పౌర్ణమి విశిష్ఠత, ఈ పవిత్ర స్నానాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగి ఆదిత్య నాథ్ కార్యాలయం నుంచి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్వీట్(ఎక్స్) చేసింది.
Also Read: Hyderabad Metro: అలర్ట్.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో మూసివేత..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
‘భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, విష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ప్రళయం ముగిసే వరకు ఏడుగురు ఋషులను, వేదాలను రక్షించాడు. దానివల్లే విశ్వం పునర్నిర్మాణం సాధ్యమైంది. దీనితో పాటుగా శంకరుడు ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ పండుగ మానవులకు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది’ అని తెలిపారు. అలాగే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాల కోసం అయెధ్య సరయూ నది వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్య ప్రాంతాన్ని 15 సెక్టార్లుగా విభజించి మూడు భద్రతా మండలాలుగా విభజించారు. భక్తుల రెస్క్యూ కోసం స్నాన ఘాట్ల వద్ద పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్), సహాయక సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసిన సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్కు.. నవ్వాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!