UP CM Yogi Adityanath: భక్తులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్తీక పౌర్ణమి సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi Adityanath: కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ భక్తులకు సందేశం ఇచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ పవిత్ర స్నానాలు కొనసాగనున్నాయి. దీంతో కార్తీక పౌర్ణమి విశిష్ఠత, ఈ పవిత్ర స్నానాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగి ఆదిత్య నాథ్ కార్యాలయం నుంచి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్వీట్(ఎక్స్) చేసింది.
Also Read: Hyderabad Metro: అలర్ట్.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో మూసివేత..
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
‘భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, విష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ప్రళయం ముగిసే వరకు ఏడుగురు ఋషులను, వేదాలను రక్షించాడు. దానివల్లే విశ్వం పునర్నిర్మాణం సాధ్యమైంది. దీనితో పాటుగా శంకరుడు ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ పండుగ మానవులకు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది’ అని తెలిపారు. అలాగే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాల కోసం అయెధ్య సరయూ నది వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్య ప్రాంతాన్ని 15 సెక్టార్లుగా విభజించి మూడు భద్రతా మండలాలుగా విభజించారు. భక్తుల రెస్క్యూ కోసం స్నాన ఘాట్ల వద్ద పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్), సహాయక సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసిన సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్కు.. నవ్వాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..