NTV Telugu Site icon

UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం

Upstudent

Upstudent

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్‌లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల మూఢ నమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి ఇవ్వడం యూపీలో సంచలనంగా మారింది. స్కూల్‌ ప్రతిష్ఠను పెంచుకునేందుకు రెండో తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాథ్రస్‌లోని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని బలి ఇచ్చిందని వెల్లడించారు. స్కూల్‌ హాస్టల్‌లో అతడిని చంపేశారని తెలిపారు. ఈ వారంలోనే జరిగినా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల డైరెక్టర్ తండ్రి బ్లాక్‌ మ్యాజిక్‌ను విశ్వసిస్తాడని వెల్లడించారు. తొలుత స్కూల్ బయట ట్యూబ్‌వెల్‌ సమీపంలో ఆ పిల్లాడిని చంపాలనుకున్నారని, అయితే హాస్టల్‌ నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు అతడు భయంతో కేకలు వేయడంతో గొంతు నులిమి హత్యచేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు దీవినే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)

సోమవారం పాఠశాల యాజమాన్యం నుంచి  ఒక ఫోన్ కాల్ వచ్చిందని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని సమాచారం ఇచ్చారన్నారు. కారులో డైరెక్టర్ తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది చెప్పారన్నారు. తర్వాత ఆ కారులో తన కుమారుడి మృతదేహం కనిపించిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు బ్లాక్‌ మ్యాజిక్‌కు సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఈ కేసులో పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతని కుమారుడు, స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న దినేష్ బాఘేల్, ముగ్గురు ఉపాధ్యాయులతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..