Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- రాహుల్ గాంధీ భారతీయుడు కాదు..
- సిక్కుల వ్యాఖ్యలపై ఉగ్రవాదుల మద్దతు పొందుతున్నాడు..
- దేశంలో నెంబర్ -1 ఉగ్రవాది రాహుల్ గాంధీనే..
- కాంగ్రెస్ నేతపై విరుచుకుపడిన కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీతో పాటు సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా గాంధీ ఇంటి వెలుపల సిక్కులు ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే, సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘దేశంలో నంబర్-1 టెర్రలిస్ట్’’ అని అభివర్ణించాడు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశానికి అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు.
గతంలో ఆయన ముస్లింలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిచాడు, కానీ అది జరగలేదని, ఇప్పుడు సిక్కుల్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాడని రవ్నీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ వ్యక్తులు కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్లే మాట్లాడారని చెప్పారు. తీవ్రవాదులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మెచ్చుకుంటున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నారంటే, దేశంలో నంబర్ వర్ టెర్రరిస్ట్ ఆయనే అని అన్నారు. సిక్కుల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపిన విషయాన్ని బిట్టూ ప్రస్తావించారు. దేశానికి అతిపెద్ద శత్రువు ఎవరినైనా పట్టుకుంటే ప్రతిఫలం ఉంటుందని అని అనుకుంటే అది రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం.
Also Read
Read Also: West Bengal: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నేతని కాల్చి చంపిన దుండగులు..
అంతకుముందు, అమెరికా వర్జీనియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సిక్కుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
‘‘రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, అతనను ఎక్కువ సమయం ప్రపంచం బయటే గడిపాడు. అతని స్నేహితులు కుటుంబం అక్కడే ఉన్నారు. దీంతో అతడు ఎక్కడికి వెళ్లినా దేశాన్ని గౌరవించడు, ప్రేమించడు. విదేవాల్లో ఉండీ భారత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటాడు’’ అని అన్నారు. ‘‘అతను ఓబీసీల గురించి కులాల గురించి మాట్లాడుతాడు. ఇతను చెప్పులు కుట్టేవారి, వడ్రంగి, మెకానిక్ బాధలను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ వారి బాధల్ని అడుగుతున్నాడు. ఫోటోల కోసం ఇదంతా చేస్తున్నాడు’’ అని బిట్టూ అన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!