UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్పోర్టులు, 200 హెలిప్యాడ్స్..
- దేశంలో కొత్తగా 100 ఎయిర్పోర్టులు, 200 హెలిప్యాడ్స్..
- ఉడాన్ 2.0కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UDAN Scheme 2.0: రాబోయే పదేళ్లలో విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి వర్గం ప్రతిష్టాత్మక ప్రణాళికలకు ఓకే చెప్పింది. బుధవారం రూ. 28,840 కోట్ల మొత్తం వ్యయంతో ఉడాన్ పథకాన్ని అప్డేట్ చేసింది. సవరించిన ఉడాన్ 2.0 పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నారు. రాబోయే 8 ఏళ్లలో రూ. 12,159 కోట్ల మూలధన వ్యయంతో, ప్రస్తుతం సేవలు అందని ఎయిర్స్ట్రిప్లను ఆధునీకరించడం ద్వారా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే లక్ష్య్ంగా పెట్టుకున్నారు.
ఈ ప్రణాళిక ద్వారా ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీని పెంచనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 200 ఆధునిక హెలిప్యాడ్స్ను అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం ఒక్కోక్కటికి రూ.15 కోట్లు వ్యయం చేయనున్నారు. కఠినమైన ప్రాంతాల్లో అత్యవసర సేవలు, ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంతో 8 ఏళ్లలో రూ. 3661 కోట్లు కేటాయించారు.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
సుదూర ప్రాంతాల్లో కార్యకలాపాలకు అవసరమైన చిన్న విమానాల కొరతను తీర్చడానికి స్వదేశీ విమానాల కొనుగోలుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా పవన్ హన్స్ కోసం రెండు హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, అలయన్స్ ఎయిర్ కోసం రెండు హెచ్ఏఎల్ డోర్నియర్ విమానాలు కేటాయించారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) కింద రూ. 10,043 కోట్లు కేటాయించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ధరకే విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
2016లో ప్రారంభించిన ఉడాన్ పథకం ద్వారా, 2026 ఫిబ్రవరి వరకు 95 విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు, వాటర్ ఏరోడ్రోమ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 3.41 లక్షల విమాన సర్వీసులు సేవలు అందించాయి. మొత్తం 1.62 కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!