UPSC Exam: ఒకే పేరు, ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంకు.. సివిల్స్ ఫలితాల్లో మిస్టరీగా మారిన ఉదంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Exam: భారతదేశంలో సివిల్స్ ఎగ్జామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఎళ్లుగా సివిల్స్ కలలతో చాలా మంది కష్టపడుతుంటారు. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరమ్మాయిల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ వచ్చింది. చివరకు వీరిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
Read Also: Amit Shah: మోడీ మూడోసారి ప్రధాని అవుతారు.. 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం.
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెంది. అయాషా ఫాతిమా(23), అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ(26) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఇద్దరికి ఒకే విధంగా 184 ర్యాంకు వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు, యూపీఎస్సీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. నేను రెండు సంవత్సరాలుగా కష్టపడి చదివానని, నా హక్కుని మరెవరో తీసుకున్నారని అయాషా మక్రానీ వాపోయారు. యూపీఎస్సీ, ప్రభుత్వం నుంచి తనకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. అయితే దీనిపై అయాషా ఫాతిమా స్పందించారు. ఇద్దరికి ఒకే రోల్ నెంబర్ ఉందని తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు. అధికారులు ఎలాంటి మోసం జరగకుండా చూస్తారని అనుకుంటున్నానని ఆమె అన్నారు..
వారిద్దరి అడ్మిట్ కార్డులను నిశితంగా పరిశీలిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపించాయి. మక్రానీ కార్డ్ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25, 2023 గురువారం రోజు పేర్కొనబడింది.. అయితే ఫాతిమా కార్డులో కూడా తేదీని చూపుతుంది, అయితే ఆ రోజు మంగళవారంగా పేర్కొనబడింది. నిజానికి క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం. ఫాతిమా కార్డు క్యూఆర్ కోడ్ కలిగి ఉండటంతో పాటు వాటర్ మార్క్ కలిగి ఉంది. మక్రానీ కార్డు క్యూాఆర్ కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్ అవుట్ తో ఉంది. చివరకు అయాషా ఫాతిమా సరైన అభ్యర్థి అని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పొరపాటు ఎలా జరిగిందో విచారిస్తామని అన్నారు.
తాజావార్తలు
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..