Odisha: స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ.. ఎలా తప్పించుకున్నారంటే..!
- ఒడిశాలో స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ
- వాష్రూమ్లోని స్కైలైట్ ద్వారా పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఇటీవల ఒక జీవితఖైదు అత్యంత కట్టుదిట్టమైన సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఖైదీ దొరికిపోయాడు. కానీ ఎలా తప్పించుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఈ ఘటన మరువక ముందే ఒడిశాలో కూడా ఇద్దరు దొంగలు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా దొంగలు తప్పించుకున్నారు. స్టేషన్ నుంచి దొంగలు పరారవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్కు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వేట ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
దొంగతనం కేసులో అనుమానితులుగా కృష్ణ సాహూ, సూర్యకాంత మొహంతిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. పూరి జిల్లాలోని గోప్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరూ కూడా వాష్ రూమ్లోని స్కైలైట్ ద్వారా తప్పించుకున్నారు. ఈ స్టేషన్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 52 కి.మీ దూరంలో ఉంది. అయితే భద్రతా లోపం కారణంగానే ఇద్దరు దొంగలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
జనరల్ స్టోర్లో ఇద్దరూ కూడా దొంగతనం చేశారు. ఈ కేసులో ప్రశ్నించడం కోసం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్లో పెట్టారు. స్టేషన్ లోపల ఒక బెంచ్ మీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా ఇద్దరిపై పలు కేసులు కూడా ఉన్నాయి. విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో ఇద్దరు కూడా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు షిఫ్ట్ మారే సమయంలో వాష్రూమ్ నుంచి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉన్నారు. ఖైదీలను పర్యవేక్షించడం సహా ఇతర విధుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!