Odisha: స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ.. ఎలా తప్పించుకున్నారంటే..!
- ఒడిశాలో స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ
- వాష్రూమ్లోని స్కైలైట్ ద్వారా పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఇటీవల ఒక జీవితఖైదు అత్యంత కట్టుదిట్టమైన సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఖైదీ దొరికిపోయాడు. కానీ ఎలా తప్పించుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఈ ఘటన మరువక ముందే ఒడిశాలో కూడా ఇద్దరు దొంగలు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా దొంగలు తప్పించుకున్నారు. స్టేషన్ నుంచి దొంగలు పరారవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్కు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వేట ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
దొంగతనం కేసులో అనుమానితులుగా కృష్ణ సాహూ, సూర్యకాంత మొహంతిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. పూరి జిల్లాలోని గోప్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరూ కూడా వాష్ రూమ్లోని స్కైలైట్ ద్వారా తప్పించుకున్నారు. ఈ స్టేషన్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 52 కి.మీ దూరంలో ఉంది. అయితే భద్రతా లోపం కారణంగానే ఇద్దరు దొంగలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
జనరల్ స్టోర్లో ఇద్దరూ కూడా దొంగతనం చేశారు. ఈ కేసులో ప్రశ్నించడం కోసం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్లో పెట్టారు. స్టేషన్ లోపల ఒక బెంచ్ మీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా ఇద్దరిపై పలు కేసులు కూడా ఉన్నాయి. విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో ఇద్దరు కూడా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు షిఫ్ట్ మారే సమయంలో వాష్రూమ్ నుంచి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉన్నారు. ఖైదీలను పర్యవేక్షించడం సహా ఇతర విధుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..