Odisha: స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ.. ఎలా తప్పించుకున్నారంటే..!
- ఒడిశాలో స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ
- వాష్రూమ్లోని స్కైలైట్ ద్వారా పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఇటీవల ఒక జీవితఖైదు అత్యంత కట్టుదిట్టమైన సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఖైదీ దొరికిపోయాడు. కానీ ఎలా తప్పించుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఈ ఘటన మరువక ముందే ఒడిశాలో కూడా ఇద్దరు దొంగలు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా దొంగలు తప్పించుకున్నారు. స్టేషన్ నుంచి దొంగలు పరారవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్కు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వేట ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
దొంగతనం కేసులో అనుమానితులుగా కృష్ణ సాహూ, సూర్యకాంత మొహంతిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. పూరి జిల్లాలోని గోప్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరూ కూడా వాష్ రూమ్లోని స్కైలైట్ ద్వారా తప్పించుకున్నారు. ఈ స్టేషన్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 52 కి.మీ దూరంలో ఉంది. అయితే భద్రతా లోపం కారణంగానే ఇద్దరు దొంగలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
జనరల్ స్టోర్లో ఇద్దరూ కూడా దొంగతనం చేశారు. ఈ కేసులో ప్రశ్నించడం కోసం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్లో పెట్టారు. స్టేషన్ లోపల ఒక బెంచ్ మీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా ఇద్దరిపై పలు కేసులు కూడా ఉన్నాయి. విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో ఇద్దరు కూడా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు షిఫ్ట్ మారే సమయంలో వాష్రూమ్ నుంచి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉన్నారు. ఖైదీలను పర్యవేక్షించడం సహా ఇతర విధుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..