Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల దాడి .. ఇద్దరు CRPF జవాన్లకు గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా తరుచుగా దాడులకు పాల్పడుతున్నారు నక్సలైట్లు. ఐఈడీలను పేలుస్తూ ఎప్పటికప్పుడు సీఆర్పీఎఫ్ జవాన్లు దెబ్బతీసేలా నీచమైన చర్యలకు పాలపడుతున్నారు. ఇలా జవాన్లు పైన దొంగదాడికి ప్రయత్నించడం నక్సలైట్లకు కొత్తేమీ కాదు. గతం లోనూ సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్ 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుధుల చేసారు. అలానే కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను సైనికులు ఆ ప్రాంతం తొలగిస్తున్నారు.
Read also:SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ లోని దంతేవాడలో నక్సలైట్లు నీచాతినీచమైన పనికి ఒడిగట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్ గా ఉదయం ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్లో ఉన్న సీఆర్పీఎఫ్, డీఆర్జీ బృందాలపై నక్సలైట్లు వరుసగా ఐఈడీలను పేల్చారు. ఈ కేమంలో బైక్ పైన వెళ్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. కాగా భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు నక్సలైట్లు ఈ పేలుడుకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!