Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల దాడి .. ఇద్దరు CRPF జవాన్లకు గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా తరుచుగా దాడులకు పాల్పడుతున్నారు నక్సలైట్లు. ఐఈడీలను పేలుస్తూ ఎప్పటికప్పుడు సీఆర్పీఎఫ్ జవాన్లు దెబ్బతీసేలా నీచమైన చర్యలకు పాలపడుతున్నారు. ఇలా జవాన్లు పైన దొంగదాడికి ప్రయత్నించడం నక్సలైట్లకు కొత్తేమీ కాదు. గతం లోనూ సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్ 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుధుల చేసారు. అలానే కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను సైనికులు ఆ ప్రాంతం తొలగిస్తున్నారు.
Read also:SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ లోని దంతేవాడలో నక్సలైట్లు నీచాతినీచమైన పనికి ఒడిగట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్ గా ఉదయం ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్లో ఉన్న సీఆర్పీఎఫ్, డీఆర్జీ బృందాలపై నక్సలైట్లు వరుసగా ఐఈడీలను పేల్చారు. ఈ కేమంలో బైక్ పైన వెళ్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. కాగా భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు నక్సలైట్లు ఈ పేలుడుకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!