Site icon NTV Telugu

ఇండియా కరోనా : నేడు 7 వేలకు పైగా కేసులు నమోదు

ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. . ఇక గత 24 గంటల్లో1910917 మందికి టీకా వేయగా… ఇప్పటి వరకు 1,33,17,84,462 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

Exit mobile version