Site icon NTV Telugu

భారత్ కరోనా : 2 వేలకు దిగువగా మరణాలు

corona

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు దిగువగా వస్తున్నాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 60,753 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,647 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,85,137కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 97,743 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Exit mobile version