ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 33,376 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 308 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 32,198 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,08,330కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,23,74,497 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతిచెందనవారి సంఖ్య 4,42,317 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,91,516 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 73,05,89,688 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.