JK: పహల్గామ్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులపై వేటు
- ఉగ్రవాద సానుభూతిపరులపై నిఘా వర్గాలు వేట
- పహల్గామ్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులపై వేటు
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు. ముగ్గురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు గూఢచారులుగా పని చేస్తున్నట్లుగా గుర్తించి వేటు వేశారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ‘‘మీరేమైనా చరిత్రకారులా..?’’ కన్నడ వ్యాఖ్యలపై కమల్ హసన్ని మందలించిన కోర్టు..
Also Read
- Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొ్న్న ఉగ్రవాదులకు ఈ ముగ్గురు అధికారులు సహాయం చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!
ఇప్పటికే పాకిస్థాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి ఎంతో మందిని నిఘా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ కోవలో అనేక మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి భరతం పడుతున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
-
Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
-
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
-
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!