Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Three Arrested In Karnataka For Killing 5 Tigers

Karnataka: 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. ఎందుకు చంపారంటే..!

Published Date :June 28, 2025 , 1:56 pm
By Suresh Maddala
  • కర్ణాటకలో 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
  • విచారణలో విస్తుగొల్పే విషయాలు వెల్లడించిన నిందితులు
Karnataka: 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. ఎందుకు చంపారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో విషాహారం తిని చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని ఫారెస్ట్ అధికారులు భావించారు. అంతేకాకుండా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అవి సహజ మరణాలు కావని.. ఎవరో చంపారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. సమీప గ్రామస్తులను విచారించగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Swetcha’s father: నా కూతురు చావుకు అతడే కారణం.. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు..

కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తమ ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా పులులకు విషం పెట్టినట్లు నిందితుడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. స్నేహితులు కోనప్ప, నాగరాజుల సాయంతో ఈ పని చేసినట్లుగా అంగీకరించాడు. చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి.. దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయని చెప్పాడు. ఇక తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..

ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు.

మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒకేసారి ఐదు పులులు చనిపోవడం కర్ణాటక చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అంత ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోనే. ఈ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… సమీప గ్రామస్తులు విషప్రయోగంతో చంపేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 tigers killing
  • karnataka
  • poisoning
  • Siddaramaiah
  • three arrested

తాజావార్తలు

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions