Kumbh Mela: కుంభమేళా ముగిసినా రద్దీ తగ్గలేదు.. ప్రయాగ్రాజ్లో భారీగా పుణ్యస్నానాలు
- కుంభమేళా ముగిసినా రద్దీ తగ్గలేదు
- ప్రయాగ్రాజ్లో భారీగా పుణ్యస్నానాలు
- శుక్రవారం భారీ స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న అధికారికంగా కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరిగింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు.. దాదాపు 45 రోజులు నిర్వహించారు. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి.
ఇది కూడా చదవండి: AP Budget 2025: బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా కూడా ప్రయాగ్రాజ్కి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రయాగ్రాజ్లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా సమయంలో రాని భక్తులంతా.. ఇప్పుడు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక అంచనాలు లేనప్పటికీ శుక్రవారం ఉదయం నుంచి త్రివేణి సంగమంలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Realme P3x: నమ్మలేని ఫీచర్స్ను బడ్జెట్ రేంజ్లోకి తీసుకొచ్చిన రియల్మి
ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో వాహనాల మీద నేరుగా ఘాట్ల దగ్గరకు చేరుకుంటున్నారు. ఇలా వేలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 5 గంటల నాటికి ఘాట్లన్నీ భక్త జనసందోహంతో కనబడ్డాయి. చాలామంది బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వచ్చారు. అంతేకాకుండా ప్రయాగ్రాజ్లోని చాలా మంది స్థానికులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మహా కుంభమేళాకు హాజరు కాలేకపోయిన చాలా మంది యాత్రికులు ఇప్పుడు వస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Assembly Budget Session 2025: ఏపీ బడ్జెట్ లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో