Kumbh Mela: కుంభమేళా ముగిసినా రద్దీ తగ్గలేదు.. ప్రయాగ్రాజ్లో భారీగా పుణ్యస్నానాలు
- కుంభమేళా ముగిసినా రద్దీ తగ్గలేదు
- ప్రయాగ్రాజ్లో భారీగా పుణ్యస్నానాలు
- శుక్రవారం భారీ స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న అధికారికంగా కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరిగింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు.. దాదాపు 45 రోజులు నిర్వహించారు. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి.
ఇది కూడా చదవండి: AP Budget 2025: బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్..
Also Read
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా కూడా ప్రయాగ్రాజ్కి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రయాగ్రాజ్లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా సమయంలో రాని భక్తులంతా.. ఇప్పుడు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక అంచనాలు లేనప్పటికీ శుక్రవారం ఉదయం నుంచి త్రివేణి సంగమంలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Realme P3x: నమ్మలేని ఫీచర్స్ను బడ్జెట్ రేంజ్లోకి తీసుకొచ్చిన రియల్మి
ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో వాహనాల మీద నేరుగా ఘాట్ల దగ్గరకు చేరుకుంటున్నారు. ఇలా వేలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 5 గంటల నాటికి ఘాట్లన్నీ భక్త జనసందోహంతో కనబడ్డాయి. చాలామంది బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వచ్చారు. అంతేకాకుండా ప్రయాగ్రాజ్లోని చాలా మంది స్థానికులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మహా కుంభమేళాకు హాజరు కాలేకపోయిన చాలా మంది యాత్రికులు ఇప్పుడు వస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Assembly Budget Session 2025: ఏపీ బడ్జెట్ లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!