S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..
- 26/11 ముంబై దాడుల సమయంలో భారత్ నుంచి స్పందనే లేదు..
- ఇలాంటి దాడులు ఇప్పుడు జరిగితే ప్రతిస్పందన వేరే విధంగా ఉంటుంది..
- భారత్ టెర్రరిజంపై జీరో టాలరెన్స్లో ఉంది..
- విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు. ముంబైలో జరిగిన సంఘటన మళ్లీ జరగకూడదని ఆయన అన్నారు. ముంబై అనేది ఉగ్రవాద వ్యతిరేక చిహ్నం అని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలోని పూణేలో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రెసెంట్ గ్లోబర్ సినారియో’’ అనే కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
Also Read
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించిన సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఉగ్రదాడికి గురైన హోటల్లోనే మేము కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం బలంగా నిలుస్తుందని ప్రజలుకు తెలుసని, ఉగ్రవాదంపై పోరులో భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.
ఉగ్రవాదంపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ని అవలంభిస్తోందని, ఎవరు ఏది చేసినా తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. పగటి పూటి వ్యాపారం చేయడం, రాత్రి పూట టెర్రరిజం చేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. భారతదేశ పరిస్థితులు మారిపోయాయని, దీనిని భారత్ అంగీకరించదని చెప్పారు. చైనా, భారత సరిహద్దుల్లో ఇరు దేశాలు త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని, 2020 ఏప్రిల్ స్థితిని పునరుద్ధరిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!