S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..
- 26/11 ముంబై దాడుల సమయంలో భారత్ నుంచి స్పందనే లేదు..
- ఇలాంటి దాడులు ఇప్పుడు జరిగితే ప్రతిస్పందన వేరే విధంగా ఉంటుంది..
- భారత్ టెర్రరిజంపై జీరో టాలరెన్స్లో ఉంది..
- విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు. ముంబైలో జరిగిన సంఘటన మళ్లీ జరగకూడదని ఆయన అన్నారు. ముంబై అనేది ఉగ్రవాద వ్యతిరేక చిహ్నం అని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలోని పూణేలో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రెసెంట్ గ్లోబర్ సినారియో’’ అనే కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించిన సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఉగ్రదాడికి గురైన హోటల్లోనే మేము కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం బలంగా నిలుస్తుందని ప్రజలుకు తెలుసని, ఉగ్రవాదంపై పోరులో భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.
ఉగ్రవాదంపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ని అవలంభిస్తోందని, ఎవరు ఏది చేసినా తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. పగటి పూటి వ్యాపారం చేయడం, రాత్రి పూట టెర్రరిజం చేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. భారతదేశ పరిస్థితులు మారిపోయాయని, దీనిని భారత్ అంగీకరించదని చెప్పారు. చైనా, భారత సరిహద్దుల్లో ఇరు దేశాలు త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని, 2020 ఏప్రిల్ స్థితిని పునరుద్ధరిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!