PM Modi: జిన్పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
- మోడీ సొంతూరని 2017లో సందర్శించిన చైనా అధ్యక్షుడు..
- జిన్పింగ్ ‘‘వాద్నగర్’’ పర్యటన వెనక చరిత్ర..
- చైనా చరిత్రకారుడు హుయత్సాంగ్లో సంబంధం..
- తొలి పాడ్కాస్ట్లో వెల్లడించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో తన తొలి పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ కీలక విషయాలను వెల్లడించారు. 2017లో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తన సొంత ఊరు గుజరాత్లోని వాద్నగర్లో పర్యటించడం వెనక ఉన్న చరిత్రను వెల్లడించారు. భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న చైనా పండితుడు ‘‘హుయాత్సాంగ్’’తో ఉన్న సంబంధాన్ని తెలిపారు.
2014లో ప్రధానిగా తాను పదవీ స్వీకరించిన తర్వాత జిన్పింగ్తో మర్యాదపూర్వకం సమావేశం జరిగింది. ‘‘నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు, అందులో ఆయన భారతదేశానికి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. నేను ‘మీకు స్వాగతం, మీరు తప్పక సందర్శించాలి’ అని అన్నాను’’ ఆయన గుజరాత్లోని తన సొంత ఊరు వాద్నగర్ సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పారని ప్రధాని మోడీ ఈ రోజు తెలిపారు.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
జిన్పింగ్ తాను వాద్నగర్ ఎందుకు సందర్శించాలనుకుంటున్నాననే విషయాన్ని తనకు చెప్పారు, హుయత్సాంగ్ చాలా కాలం వాద్నగర్లో నివసించారని చైనా అధ్యక్షుడు తనకు చెప్పారని ప్రధాని మోడీ వెల్లడించారు.
వాద్నగర్తో హుయత్సాంగ్కి అనుబంధం:
2017లో జిన్పింగ్ గుజరాత్లోని ప్రధాని స్వస్థలం వాద్నగర్ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని, అలాగే చైనా అధ్యక్షుడి స్వస్థలం జియాన్తో ప్రత్యేక సంబంధం ఉందని అన్నారు. 2015లో చైనాలో ద్వైపాకిక్ష పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ జియాన్ని సందర్శించారు.
ఇటీవల, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) వాద్నగర్లో మూడు దశల్లో తవ్వకాలు జరిపింది. దాదాపుగా 1400 ఏళ్ల క్రితం ఈ ప్రదేశాన్ని సందర్శించిన హుయత్సాంగ్తో సంబంధాలను ధ్రువీకరించడాని వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో బౌద్ధ మఠాల ఉనికిని సూచిస్తున్నాయి. హుయాత్సాంగ్ తన పర్యటనలో వాద్నగర్లో బస చేసినప్పుడు 10 పెద్ద బౌద్ధ ఆరామాలను చూశానని చెప్పాడు. వాద్నగర్ని ఓ ఓ-నాన్-టు-పు-లో అని ఉచ్చరించాడు, దీని అర్థం ఆనందపుర. వాద్నగర్ ప్రాంతానికి పురాతన పేరు. హుయాత్సాంగ్ వాద్నగర్ సందర్శన సమయంలో కన్నౌజ్కి చెందిన హర్షవర్ధనుడు ఈ ప్రాంతానికి రాజుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!