PM Modi: జిన్పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
- మోడీ సొంతూరని 2017లో సందర్శించిన చైనా అధ్యక్షుడు..
- జిన్పింగ్ ‘‘వాద్నగర్’’ పర్యటన వెనక చరిత్ర..
- చైనా చరిత్రకారుడు హుయత్సాంగ్లో సంబంధం..
- తొలి పాడ్కాస్ట్లో వెల్లడించిన ప్రధాని మోడీ..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో తన తొలి పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ కీలక విషయాలను వెల్లడించారు. 2017లో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తన సొంత ఊరు గుజరాత్లోని వాద్నగర్లో పర్యటించడం వెనక ఉన్న చరిత్రను వెల్లడించారు. భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న చైనా పండితుడు ‘‘హుయాత్సాంగ్’’తో ఉన్న సంబంధాన్ని తెలిపారు.
2014లో ప్రధానిగా తాను పదవీ స్వీకరించిన తర్వాత జిన్పింగ్తో మర్యాదపూర్వకం సమావేశం జరిగింది. ‘‘నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు, అందులో ఆయన భారతదేశానికి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. నేను ‘మీకు స్వాగతం, మీరు తప్పక సందర్శించాలి’ అని అన్నాను’’ ఆయన గుజరాత్లోని తన సొంత ఊరు వాద్నగర్ సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పారని ప్రధాని మోడీ ఈ రోజు తెలిపారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
జిన్పింగ్ తాను వాద్నగర్ ఎందుకు సందర్శించాలనుకుంటున్నాననే విషయాన్ని తనకు చెప్పారు, హుయత్సాంగ్ చాలా కాలం వాద్నగర్లో నివసించారని చైనా అధ్యక్షుడు తనకు చెప్పారని ప్రధాని మోడీ వెల్లడించారు.
వాద్నగర్తో హుయత్సాంగ్కి అనుబంధం:
2017లో జిన్పింగ్ గుజరాత్లోని ప్రధాని స్వస్థలం వాద్నగర్ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని, అలాగే చైనా అధ్యక్షుడి స్వస్థలం జియాన్తో ప్రత్యేక సంబంధం ఉందని అన్నారు. 2015లో చైనాలో ద్వైపాకిక్ష పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ జియాన్ని సందర్శించారు.
ఇటీవల, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) వాద్నగర్లో మూడు దశల్లో తవ్వకాలు జరిపింది. దాదాపుగా 1400 ఏళ్ల క్రితం ఈ ప్రదేశాన్ని సందర్శించిన హుయత్సాంగ్తో సంబంధాలను ధ్రువీకరించడాని వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో బౌద్ధ మఠాల ఉనికిని సూచిస్తున్నాయి. హుయాత్సాంగ్ తన పర్యటనలో వాద్నగర్లో బస చేసినప్పుడు 10 పెద్ద బౌద్ధ ఆరామాలను చూశానని చెప్పాడు. వాద్నగర్ని ఓ ఓ-నాన్-టు-పు-లో అని ఉచ్చరించాడు, దీని అర్థం ఆనందపుర. వాద్నగర్ ప్రాంతానికి పురాతన పేరు. హుయాత్సాంగ్ వాద్నగర్ సందర్శన సమయంలో కన్నౌజ్కి చెందిన హర్షవర్ధనుడు ఈ ప్రాంతానికి రాజుగా ఉన్నారు.
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!