Rahul Gandhi Fire On EC: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..
- దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..
- ఈసీ ఇచ్చిన వివరాలతో పోలిస్తే మోసం బయటపడింది..
- ఈసీ మాకు ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేకపోయింది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే.. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.. న్యాయవాదులు కాంగ్రెస్ కు వెన్నుముక గా ఉన్నారు.. మీరు చేసిన త్యాగాలను ఇపుడు విధ్వంసం చేశారు.. ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఇక, భారత్ లో ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో పీఎం ఇన్ని సీట్లు గెలవలేరు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాం.. ఎలా పోరాడాలో మాకు తెలుసు.. రాజకీయ నాయకులుగా మా పోరాటం చేస్తున్నాం.. న్యాయవాదులు కోర్టుల్లో పోరాడాలని సూచించారు. పీఎం ఆఫీస్ రఫెల్ బీ విషయంలో ఇచ్చిన డాక్యుమెంట్ స్పష్టంగా ఉంది.. ఏ దేశంలో ఇలా జరగదు.. నాపై కేసులు పెట్టారు, 30 కేసుల్లో పోరాడుతున్నాను.. రైతుల కోసం పోరాడితే.. నన్ను బెదిరించారు అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎవరికి భయపడదు.. దేశం మా రక్తం.. రాజ్యాంగంపై అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు.. రాజ్యాంగం పరిధిలోకి దేశంలోని అన్ని వర్గాలు వస్తాయి.. చరిత్రపై, చట్టాలపై, రాజ్యాంగంపై దాడి చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
Read Also: Rahul Gandhi: 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు..
అయితే, నా కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.. నేను ఎవరికి భయపడను అని రాహుల్ గాంధీ తెల్చి చెప్పారు. అగ్గికి భయపడి పోరాటం ఆపలేను.. ఎన్నటికైనా కాలి పోవాల్సిందే.. కాంగ్రెస్ శాంతి యుతంగా పోరాడుతుంది.. రాజకీయంగా మేం ఎలాగైనా పోరాడుతామన్నారు. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడాల్సింది న్యాయవాదులు.. దేశంలో ఇపుడు లీగల్ సర్వీస్ అవసరం పడుతుంది.. దేశంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయవాదుల అవసరం ఉంది.. లీగల్ ఎయిడ్ అందరికీ అందించాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..