Rahul Gandhi Fire On EC: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..
- దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..
- ఈసీ ఇచ్చిన వివరాలతో పోలిస్తే మోసం బయటపడింది..
- ఈసీ మాకు ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేకపోయింది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే.. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.. న్యాయవాదులు కాంగ్రెస్ కు వెన్నుముక గా ఉన్నారు.. మీరు చేసిన త్యాగాలను ఇపుడు విధ్వంసం చేశారు.. ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
ఇక, భారత్ లో ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో పీఎం ఇన్ని సీట్లు గెలవలేరు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాం.. ఎలా పోరాడాలో మాకు తెలుసు.. రాజకీయ నాయకులుగా మా పోరాటం చేస్తున్నాం.. న్యాయవాదులు కోర్టుల్లో పోరాడాలని సూచించారు. పీఎం ఆఫీస్ రఫెల్ బీ విషయంలో ఇచ్చిన డాక్యుమెంట్ స్పష్టంగా ఉంది.. ఏ దేశంలో ఇలా జరగదు.. నాపై కేసులు పెట్టారు, 30 కేసుల్లో పోరాడుతున్నాను.. రైతుల కోసం పోరాడితే.. నన్ను బెదిరించారు అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎవరికి భయపడదు.. దేశం మా రక్తం.. రాజ్యాంగంపై అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు.. రాజ్యాంగం పరిధిలోకి దేశంలోని అన్ని వర్గాలు వస్తాయి.. చరిత్రపై, చట్టాలపై, రాజ్యాంగంపై దాడి చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
Read Also: Rahul Gandhi: 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు..
అయితే, నా కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.. నేను ఎవరికి భయపడను అని రాహుల్ గాంధీ తెల్చి చెప్పారు. అగ్గికి భయపడి పోరాటం ఆపలేను.. ఎన్నటికైనా కాలి పోవాల్సిందే.. కాంగ్రెస్ శాంతి యుతంగా పోరాడుతుంది.. రాజకీయంగా మేం ఎలాగైనా పోరాడుతామన్నారు. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడాల్సింది న్యాయవాదులు.. దేశంలో ఇపుడు లీగల్ సర్వీస్ అవసరం పడుతుంది.. దేశంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయవాదుల అవసరం ఉంది.. లీగల్ ఎయిడ్ అందరికీ అందించాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!